స్పీడ్ పెంచిన రవితేజ.. ఆ రెండు సినిమాలకి గ్రీన్ సిగ్నల్..!?

Anilkumar
టాలీవుడ్ మాస్ మహారాజా గా ఎన్నో సినిమాల్లో నటించిన రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే మాస్ మహారాజా రవితేజ గత రెండేళ్లుగా ఈయడానికి మూడు సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేస్తున్నాడు. కాగా ఈ అన్ని సినిమాల్లో నాలుగు సినిమాల్లో బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాపులుగా మారాయి. ఇక ఏడాది ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రవితేజ. కాగా ఈ సినిమా సైతం యావరేజ్ టాక్ సంపాదించుకుంది. కాగా ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాల తరువాత మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు రవితేజ. ఈ సినిమా అయిపోయిన వెంటనే ఆ సినిమాలను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు రవితేజ. ఆ సినిమా తర్వాత సామజ వరగమన రైటర్ భాను భోగవరపు తో కూడా సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఆ సినిమాకి సంబంధించిన కథను కూడా వినిపించినట్లుగా తెలుస్తోంది. అది కూడా రవితేజ కి బాగా నచ్చడంతో ఈ సినిమా చేయడానికి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

ఈ రెండు ప్రాజెక్ట్స్ ని సితార ఎంటెర్టైమెంట్స్ పతాకం పై సూర్యదేవర నాగవంశీ నిర్మించబోతున్నారట. త్వరలోనే ఈ రెండు ప్రాజెక్ట్స్ ని లాంచ్ చేసి షూటింగ్ మొదలు పెట్టనున్నారట. కాగా ఈ రెండు సినిమాలు కామెడీ జోనర్ లోనే ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. రవితేజ నుంచి ఓ కామెడీ ఎంటర్టైనర్ వచ్చి చాలా ఏళ్ళు అవుతుంది. దీంతో ఫ్యాన్స్ అంతా ఆయన కామెడీ టైమింగ్ ని బాగా మిస్ అవుతున్నారు. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ రెండు కామెడీ జోనర్ సినిమాలకు సైన్ చేయడంతో.. వింటేజ్ రవితేజని చూడబోతున్నామంటూ అభిమానులు ఖుషి అవుతున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: