థ్రిల్లర్ 'మాత్రు' ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన సెన్సేషనల్ రైటర్ విజయేంద్ర ప్రసాద్?
తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచింగ్ జరిగింది. సెన్సేషనల్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ మాత్రు మూవీ ఫస్ట్ లుక్ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులకు సెన్సేషనల్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హరి ప్రసాద్ కూడా పాల్గొన్నారు. ప్రధాన తారాగణం అంతా ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్న ధ్రిల్లర్ మూవీ మాత్రు ఫస్ట్ లుక్ పోస్టర్.. సినిమాపై చాలా ఆసక్తిని రేపింది.
ఈ ధ్రిల్లర్ మూవీ మాత్రు సినిమాలో అలీ, దేవి ప్రసాద్, ఆమని, రవి కాలే, నందిని రాయ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ధ్రిల్లర్ మూవీ మాత్రుకి స్టార్ కంపోజర్ శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్నారు. రాహుల్ శ్రీవాస్తవ్ ఈ ధ్రిల్లర్ మూవీ మాత్రుకి డీవోపీగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సత్యనారాయణ ఎడిటర్. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తున్న ధ్రిల్లర్ మూవీ మాత్రు విడుదలకు సిద్ధమౌతోంది. త్వరలోనే మేకర్స్ ఈ మాత్రు మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయబోతున్నారు.
ధ్రిల్లర్ మూవీ మాత్రు
తారాగణం: సుగి విజయ్, రూపాలిభూషణ్, శ్రీకాంత్, రవి కాలే, పృధ్వీ రాజ్, అలీ, దేవి ప్రసాద్, ఆమని, నందిని రాయ్ తదితరులు
ధ్రిల్లర్ మూవీ మాత్రు - టెక్నికల్ టీం:
రచన, దర్శకత్వం: జాన్ జక్కీ
బ్యానర్: శ్రీపద్మినీ సినిమాస్
నిర్మాత: బి.శివప్రసాద్
సంగీతం: శేఖర్ చంద్ర
డీవోపీ: రాహుల్ శ్రీవాస్తవ్
ఎడిటర్: సత్యనారాయణ
ఫైట్స్: నందు మాస్టర్
పీఆర్వో: తేజస్వీ సజ్జా