వావ్: అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం.. మ్యూజియంలో కొలువుదిరిన విగ్రహం..!!

Divya
టాలీవుడ్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. ముఖ్యంగా పుష్ప సినిమాతో విపరీతమైన క్రెజ్ పెరిగింది. పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు కూడా రావడం జరిగింది. ఇప్పుడు మరొకసారి తాజాగా మరో ఘనతను అందుకున్నారు. దుబాయిలో ప్రముఖ మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఈ రోజున కొలువుదీరింది. అల్లు అర్జున్ స్వయంగా దుబాయ్ వేడుకలలో వెళ్లి అక్కడ మ్యూజియంలో తన సొంత విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు.
అనంతరం విగ్రహంతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం సినిమాలోని స్టైలిష్ లుక్ లో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ విగ్రహం వెనుక ఫోటోతో మాత్రమే అల్లు అర్జున్ చూపించారు. ఫ్రేంట్ ఫోటో కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.. మేడమ్ టుసాడ్స్ మైనపు విగ్రహా ఆవిష్కరణ జరగడంతో అభిమానులు తెగ సంబరపడుతున్నారు.

ఇది తమ హీరోకి ఒక అద్భుతమైన క్షణం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ కూడా ప్రతి కళాకారుడు జీవితంలో ఇలాంటిది ఒక అద్భుతం ఆయన క్షణమని ఇది ఒక మైలురాయి అంటూ ధన్యవాదాలు తెలుపుతూ మైనపు విగ్రహం ఫోటో ని షేర్ చేశారు.. పలువురు సిని సెలబ్రిటీలు బంధువులు కూడా అల్లు అర్జున్ కు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ విగ్రహాన్ని చూసేందుకు అక్కడే అభిమానులు క్యూ కడుతున్నట్లు నిర్వాహకులు తెలియజేస్తున్నారు. వివిధ రంగాలలో అసమానమైన విజయాలను అందుకున్న వారికి ఇలాంటి మైనపు విగ్రహాలను సైతం ప్రతిష్టిస్తూ ఉంటారు సినీ పరిశ్రమలు ఎన్నో విజయాలను అందుకున్న వారిని ఇలా సత్కరించిన జాబితాలో అల్లు అర్జున్ కూడా చేరారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఈ వీడియో కూడా వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: