జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే అంటున్న వరలక్ష్మి...!!!
2012లో శింబు సరసన పోడాపోడి చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆచిత్రం ఆశించిన సక్సెస్ కాలేదు. దీనితో హీరోయిన్ గా ఆఫర్స్ అందుకోవడం వరలక్ష్మికి కష్టంగా మారిందట. ఇక పర్సనల్ లైఫ్ గురించి కూడా వరలక్ష్మి ఆసక్తికర విషయాలు రివీల్ చేసింది. తన లైఫ్ ఏదీ తాను అనుకున్నట్లు జరగలేదని పేర్కొంది.28 ఏళ్ళు వచ్చేసరికి స్టార్ హీరోయిన్ కావాలని అనుకుందట. అది జరగలేదు. 32 ఏళ్లకు పెళ్లి చేసుకోవాలని కూడా ప్రయత్నించిందట. అదీ జరగలేదు. 34 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు బిడ్డని కనాలని ప్రయత్నించా అది కూడా జరగలేదు. త్వరగా తల్లిని కావాలనే కోరిక ఉండేది. ఇప్పుడు నా వయసు 38 ఏళ్ళు. ఇంతవరకు నేను అనుకున్న సక్సెస్ సాధించలేకపోయా.పోడాపోడీ చిత్రం తర్వాత నా పర్సనల్ లైఫ్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టా. నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే. నా కెరీర్ కోసం ఆ టైం వెచ్చించి ఉంటే సినీ కెరీర్ లో ఇంకా బాగా సక్సెస్ అయ్యేదాన్ని అని వరలక్ష్మి శరత్ కుమార్ పేర్కొంది. అయితే తాను ఎదుర్కొన్న ఇబ్బందులే తనని దృడంగా మార్చాయని వరలక్ష్మి పేర్కొంది. గతంలో వరలక్ష్మి శరత్ కుమార్, విశాల్ మధ్య ఎఫైర్ సాగుతున్నట్లు పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చాయి.