హరిహర వీరమల్లు "ఓటిటి" హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల క్రితం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమాను మొదలు పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తూ ఉండగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటి నిధి అగర్వాల్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడి గా కనిపించబోతోంది. ఇకపోతే ఏ ఎం రక్తం ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. చాలా రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తుంది.
 

దానితో మొదటి సారి ఈ సినిమా షూటింగ్ వాయిదా పడిన సమయం లో దర్శకుడు క్రిష్ , వైష్ణవ్ తేజ్ తో కొండపొలం అనే సినిమాను రూపొందించాడు. మళ్ళీ ఆ తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. ప్రస్తుతం కూడా ఈ సినిమా షూటింగ్ జరగడం లేదు. దానితో దర్శకుడు క్రిష్ , అనుష్క తో మూవీ ని సెట్ చేసుకున్నాడు. ఆ మూవీ షూటింగ్ పూర్తి అయిన తర్వాత హరిహర వీరమల్లు సినిమా మళ్ళీ సెట్స్ పైకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను ఓ ప్రముఖ సంస్థకు అమ్మ వేశారు.

తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలుబడింది. ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది. తాజాగా ఈ విషయాన్ని ఈ సంస్థ వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ పై పవన్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: