మంచు ఫ్యామిలీ లేకుండా భార్య సీమంతం చేసిన మనోజ్..!?

Anilkumar
టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కొడుకు మంచు మనోజ్ తాజాగా తన భార్య మౌనిక సీమంత వేడుకలను తన ఇంట్లోనే జరిపించాడు. ఇక ఇందులో ఆశ్చర్యం ఏమిటి అంటే ఈ సీమంత ఫంక్షన్ లో మంచు మనోజ్ భార్య మంచు మనోజ్ తప్ప మంచు ఫ్యామిలీ ఎవ్వరూ కూడా కనిపించలేదు. మరొక విషయం ఏమిటంటే వీరిద్దరికీ చాలా క్లోజ్ గా ఉండే మంచు లక్ష్మి కూడా ఆ ఫంక్షన్ లో లేదు. ఇక అసలు మ్యాటర్ లోకి వెళ్తే మంచు మనోజ్ కు ఇదివరకే పెళ్లయింది. కానీ కొన్ని కారణాల వల్ల తన మొదటి భార్యతో విడాకులు తీసుకున్నడు. మౌనిక కి సైతం మొదట ఒక పెళ్లయింది. 

ఆమె కూడా తన భర్తతో విడాకులు తీసుకుంది. అలా వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇటీవల వారి పెళ్లి కూడా అంగరంగ వైభవంగా జరిగింది. అలా వారిద్దరి పెళ్లి సమయంలో మంచు కుటుంబానికి భూమా మౌనిక కోడలుగా రావడం అసలు ఇష్టం లేదని అందుకే మంచు ఫ్యామిలీ ఈ పెళ్లికి చాలా దూరంగా ఉన్నారు అని మంచు లక్ష్మీ దగ్గరుండి వీరిద్దరి వివాహం జరిపించింది అన్న వార్తలు సైతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారమయ్యాయి.ఇక మౌనిక మొదటి భర్తకు పుట్టిన కొడుకుని కూడా మనోజ్  యాక్సెప్ట్ చేసి తనకు శివుడు ఇచ్చిన వరం అని చెప్పుకొచ్చారు.

అలాగే రీసెంట్గా అతని బర్త్డే వేడుకలు కూడా గ్రాండ్గా చేశారు. అయితే తాజాగా భూమా మౌనికకు 7 నెలలు కావడంతో ఆమెకు సీమంతపు వేడుక చేశారు మనోజ్. అయితే ఈ సీమంతపు వేడుకల్లో మంచు ఫ్యామిలీ కనిపించలేదు. సొంత తల్లిదండ్రులతో పాటు పెళ్లి చేసిన అక్క కూడా సీమంతానికి రాలేదు. అలాగే మనోజ్ కి విష్ణు అయితే చాలా దూరంగా ఉంటున్నారట.వీరిద్దరి మధ్య ఇంకా విభేదాలు తగ్గలేదని తెలుస్తోంది. ఇక మౌనిక సీమంతం  ఆళ్లగడ్డలోని ఆమె పుట్టింటిలో జరిగింది. ఇక ఫంక్షన్ ని మనోజ్ దగ్గరుండి చేయించారు. అయితే సీమంతం ఫంక్షన్ కి మంచు ఫ్యామిలీ రాకపోవడంతో ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: