నటి లక్ష్మిపై షాకింగ్ వ్యాఖ్యలు చేసిన మాజీ భర్త..!!
పెళ్లి చేసుకుంటావా అని లక్ష్మి అడగడంతో తనకు ఆ రాత్రి నిద్ర పట్టలేదని మోహన్ కుమార్ వెల్లడించారు. "లక్ష్మి చెప్పిన ఆ మాటలకు నేను అప్పుడు షాకయ్యా. ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. నాకు తొలిసారి ఓ అమ్మాయి ప్రేమను వ్యక్తం చేసింది. నేను లక్ష్మి మాటలను చాలా సీరియస్గా తీసుకున్నా. ఆ తర్వాత కాల్ చేసిన ఆమె తన రూమ్కు రమ్మని పిలిచారు. నేను వెంటనే హోటల్కు వెళ్లాను. మనం ఇద్దరం పెళ్లి చేసుకుందామా అని ఆమె అడిగారు. అయితే నేను ప్రస్తుతం కెరీర్పై ఫోకస్ చేస్తున్నానని, పెళ్లి గురించి ఆలోచించడం లేదని చెప్పా" అని మోహన్ కుమార్ చెప్పారు.తాను లక్ష్మి నుదుటన బొట్టు పెట్టానని, ఆ రాత్రే తాము భార్యభర్తలమయ్యామని మోహన్ కుమార్ చెప్పారు. "నేనూ, తను గౌరవప్రదమైన కుటుంబాల నుంచి వచ్చాం. పెళ్లి అయ్యే వరకు మా మధ్య ఏమీ జరగలేదు. తనను పెళ్లి చేసుకోవాలని లక్ష్మి అడిగాక నేను ఆమె నుదుటన కుంకుమ పెట్టా. ఆ రాత్రే మేం భార్యభర్తలం అయ్యాం. ఆ తర్వాత మేం చెన్నైకి వచ్చి లాయర్ ద్వారా మా పెళ్లి విషయాన్ని మీడియాకు తెలియజేశాం" అని మోహన్ కుమార్ చెప్పారు.సినిమాల్లో బిజీగా ఉన్న కారణంగా పెళ్లి తర్వాత లక్ష్మి, తాను ఎక్కువ సేపు సమయం గడిపేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉండేవని మోహన్ కుమార్ చెప్పారు. అయితే, లక్ష్మి చాలా తప్పులు చేశారని, వాటన్నింటి గురించి తాను ఇప్పుడు చెప్పలేనని ఆయన అన్నాడు. తన జీవితంలోకి మరో పురుషుడిని లక్ష్మి రానిచ్చారని మోహన్ కుమార్ ఆరోపించారు. కూతురు ఐశ్వర్య, లక్ష్మి మధ్య తరచూ గొడవలు కూడా అయ్యేవని ఆయన వెల్లడించారు.1980లో మోహన్ కుమార్తో విడాకులు తీసుకున్నారు లక్ష్మి. ఆ తర్వాత నటుడు, దర్శకుడు శివచంద్రన్ను పెళ్లి చేసుకున్నారు. 1982లో శాంతిని మోహన్ వివాహం చేసుకున్నారు.