ఆ కారణంతో "పుష్ప 2" లేటెస్ట్ షెడ్యూల్ రద్దు..!

Pulgam Srinivas
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం "పుష్ప పార్ట్ 2" మూవీ తెరకెక్కుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మలయాళ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి ఫాహాద్ ఫాజిల్ విలన్ పాత్రలో కనిపించనుండగా ... సునీల్ , అనసూయ , రావు రమేష్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఉండగా ... మైత్రి సంస్థ వారు ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమాను ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు చాలా రోజుల క్రితమే ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన చిత్ర షూటింగ్ ను చాలా స్పీడ్ గా పూర్తి చేస్తూ వస్తున్నారు.

ఇకపోతే ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ సినిమా యొక్క షెడ్యూల్ ను వైజాగ్ లో ఫిక్స్ చేసుకుంది. అందులో భాగంగా యూనిట్ అంతా కూడా వైజాగ్ వెళ్లిన తర్వాత అల్లు అర్జున్ కు తీవ్ర జ్వరం రావడంతో వెంటనే ఈ మూవీ బృందం వైజాగ్ షెడ్యూల్ ను క్యాన్సల్ చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు హైదరాబాదు లోని తాహిర్ స్టూడియోలో ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ మొదటి భాగం మంచి విజయం సాధించడంతో ఈ మూవీ రెండవ భాగం పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa

సంబంధిత వార్తలు: