ఆ తేదీ నుండి "ఓటిటి" లోకి భ్రమయుగం..!

Pulgam Srinivas
మలయాళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మమ్ముట్టి తాజాగా బ్రమయుగం అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . భారీ అంచనాల నడు మ మొదట మలయాళ భాషలో విడుదల ఆయన ఈ సినిమా అక్కడి ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంది . దానితో ఈ మూవీ భారీ విజయాన్ని మలయాళ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది.
 

ఇలా మలయాళం లో అద్భుతమైన టాక్ ను తెచ్చుకొని భారీ కలెక్షన్ లను ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమాని తెలుగు లో కూడా విడుదల చేశారు. మలయాళం లో సూపర్ సక్సెస్ అయిన సినిమా కావడంతో ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ తెలుగు లో విడుదల అయిన ఈ సినిమా టాలీవుడ్ ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరించడంలో కాస్త విఫలం అయింది అని చెప్పవచ్చు.

ఇకపోతే ఇప్పటికే మలయాళం లో బ్లాక్ బాస్టర్ విజయం అందుకొని తెలుగు లో పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకున్న ఈ సినిమా మరికొన్ని రోజుల్లో డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను సోనీ లీవ్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని మార్చి 15 వ తేదీ నుండి స్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా సోనీ లీవ్ "ఓ టి టి" సంస్థ వారు అధికారికంగా ప్రకటించారు. మరి ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుంది అనే విషయం తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: