5 సెకన్లకి 5 కోట్లు.. మహేష్ క్రేజ్

Anilkumar
సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్లో తన తోటి  హీరోలు పాన్ ఇండియా సినిమాలతో సత్తా చాటుతుంటే మహేష్ మాత్రం రీజనల్ సినిమాతోనే పాన్ ఇండియా రికార్డ్స్ ని బ్రేక్ చేస్తున్నాడు. సినిమాలే కాదు వివిధ కంపెనీలకు సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో రకాల యాడ్స్ తో ఆకట్టుకున్నాడు. మహేష్ బాబు కోసం ఎక్కడి నుంచో కంపెనీలు వెతుక్కుంటూ మరీ వస్తాయి. ఇక అలా వచ్చిన కంపెనీలలో ఫోన్ పే కూడా ఒకటి. ఫోన్ పే వాళ్ళు ఒక కొత్త ఐడియాను తీసుకుని వచ్చారు. సాధారణంగా మనం ఎవరికైనా ఎప్పుడైనా సరే 

ఫోన్ పే లో డబ్బులు చెల్లించినట్లయితే, అక్కడున్న స్పీకర్ లో 'రిసీవ్డ్ రుపీస్' అంటూ వాయిస్ వస్తుంది. అది ఫ్రీ రికార్డిండ్ లేడీ వాయిస్. ఇప్పుడు ఇదే వాయిస్ కి బదులుగా మహేష్ బాబు వాయిస్ ని వాడుకోవాలని ఫోన్ పే కంపెనీ ప్లాన్ చేసింది. 'ఫోన్ పే' స్మార్ట్ స్పీకర్ నుండి మహేశ్ బాబు వాయిస్ వినిపిస్తుందని చెప్పడం కోసం ఒక యాడ్‌ను కూడా తయారు చేయిస్తున్నారు.  ఆ యాప్ ద్వారా అధికారికంగా ప్రకటన బయటికి రానుంది.

 'ఫోన్ పే'లో ట్రాన్సాక్షన్ పూర్తయ్యిందని మహేశ్ బాబు వాయిస్‌లో వినిపించగా.. ఆ తర్వాత వచ్చే అమౌంట్ మాత్రం ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ద్వారా క్రియేట్ చేయబ

డనుంది. ఆ తర్వాత మళ్లీ మహేశ్ వాయిస్‌లోనే 'థ్యాంక్యూ బాస్' అని వినిపించనుంది. కాగా ఈ ఫోన్ పే UPI కోసం మహేష్ బాబు ఓ ఐదు సెకండ్లు వాయిస్ అందించారు. దీనికోసం ఏకంగా ఐదు కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్లు తాజా సమాచారం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం తెలిసిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ మహేశ్ క్రేజ్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: