బాలీవుడ్ పోర్న్ స్టార్ పూనమ్ పాండేపై కేసు?

Purushottham Vinay
బాలీవుడ్ పోర్న్ స్టార్ పూనమ్ పాండే గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్‌ తో మరణించినట్లు సోషల్ మీడియాలో స్వయంగా ఆమె ఖాతా నుంచి పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.దీంతో ఈమె మరణ వార్త ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సమయంలో... ఇక ఈ కేసులో భాగంగా రియాల్టీ షో డేటింగ్ బాజీ ఫేమ్ ఫైజాన్ అన్సారీ కోర్టుకెక్కారు. దీంతో... పూనమ్ పాండే ఇప్పుడు కొత్త కష్టాలు కొని తెచ్చుకున్నట్లయ్యిందనే కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. పూనమ్ పాండే, ఆమె భర్త సామ్ బాంబేపై రూ.100 కోట్ల పరువు నష్టం కేసు వేసి పెద్ద షాక్ ఇచ్చారు ఫైజాన్ అన్సారీ. సీపీ అఖిల్ కుమార్ ఈ విషయం మీద విచారణకు ఆదేశించారు. దీంతో పాటు ఫైజాన్ అన్సారీ కాన్పూర్ కోర్టులో దావా వేయనున్నారని సమాచారం తెలుస్తుంది.ఎందరో దేశ ప్రజల మనోభావాలను పూనమ్ పాండే దెబ్బతీసిందని ఫైజాన్ అన్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశం అవుతుంది.అమెరికా ఫార్మాస్యూటికల్ కంపెనీ మెర్క్‌, భారతీయ అనుబంధ సంస్థ ఎం.ఎస్.డీతో కలిసి గతంలో ఓ ఒప్పందంని కుదుర్చుకుంది.


ఇక ఆ ఒప్పందంలో భాగంగానే.. సర్వైకల్ క్యాన్సర్ పై ప్రచార బాధ్యతను తీసుకుంది. ఆ క్రమంలోనే కాస్త క్రేజీగా ఆలోచించి తాను సర్వైకల్ క్యాన్సర్ తో చనిపోయినట్టు పోస్ట్ పెట్టించింది పూనమ్ పాండే. ఇక ఆ తర్వాత ఈ సంస్థ సర్వైకల్ క్యాన్సర్ అవేర్ వీడియోతో.. తాను బతికే ఉన్నాను అంటూ ఆమె బయటికి వచ్చింది.పూనమ్ పాండే చనిపోయిందని ఆమె అధికారిక ఇన్ స్టా హ్యాండిల్ నుండి పోస్ట్ చేయడంతో అది నిజమే అని అందరూ అనుకున్నారు. దీంతో ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న ఫైజాన్ అన్సారీ దెబ్బకు పూనమ్ పాండే మీద పరువు నష్టం దావా వేశారు. తప్పుడు పబ్లిక్ అటెన్షన్ కోసం పూనమ్ పాండే ఇలాంటి చెత్త పని చేస్తూనే ఉందని ఆయన ఈ సందర్భంగా స్పందించారు.ఇక అన్సారీ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, పూనమ్ పాండే ఆమె భర్త.. నకిలీ మరణాన్ని ప్రకటించి కేవలం తమ ప్రచారం కోసం వాడుకున్నారని ఆరోపించాడు. ఇలా చేసి చాలామంది ప్రజలకు చాలా బాధ కలిగించిందని, అదీ కాకుండా ఇది ఒక మోసపూరిత చర్య అని అతను తన ఫిర్యాదులో చెప్పాడు. అందుకే వారిద్దరినీ అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరచాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: