"ఎస్ఎస్ఎంబి 29" టెక్నికల్ టీం వివరాలు ఇవే..!

Pulgam Srinivas
దర్శక దీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ... సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబో లో మరికొన్ని రోజుల్లో ఓ భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీ స్టార్ట్ కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అనేక వార్తలు బయటకు వచ్చాయి. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు పని చేయబోయే టెక్నికల్ టీం కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగా ఈ సినిమాకు టెక్నికల్ టీం గా ఎవరు వర్క్ చేయబోతున్నారు అనే విషయాలను తెలుసుకుందాం.
ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వ వహించనుండగా ... రాజమౌళి తండ్రి ప్రముఖ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథను అందించబోతున్నాడు. ఇప్పటికే "ఆర్ ఆర్ ఆర్" మూవీ తో ఆస్కార్ అవార్డ్ ను గెలుపొంది ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ను సంపాదించుకున్న ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించనుండగా ... పి ఎస్ వినోద్ ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయబోతున్నాడు. ఆర్ సి కమల కన్నన్ ఈ మూవీ కి "వి ఎఫ్ ఎక్స్" సూపర్వైజర్ గా పని చేయనుండగా ... మోహన్ బింగి ఈ మూవీ కి ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేయబోతున్నాడు. తమ్మి రాజు ఈ మూవీ కి ఎడిటర్ గా పనిచేయనుండగా ... రమా రాజమౌళి ఈ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ మరియు స్టైలిస్ట్ గా వర్క్ చేయబోతోంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ కలిగిన టెక్నికల్ టీం ఈ సినిమాకు పని చేయబోతుంది. అలాగే ఈ మూవీ కి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా మరి కొన్ని రోజుల్లోనే బయటకు వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: