ఆ మూవీ కథ నాకు అస్సలు నచ్చలేదు... అయినా అందుకే చేశా... రష్మిక మందన..!

Pulgam Srinivas
నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ ఛలో అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం వరుస సినిమా లలో నటిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా రష్మిక కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. అందులో భాగంగా తాను నటించినటువంటి ఆడల్లు మీకు జోహార్లు సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా రష్మిక "ఆడళ్లు మీకు జోహార్లు" సినిమా గురించి మాట్లాడుతూ ... నాకు ఆడాళ్లు మీకు జోహార్లు సినిమా కథ ఏ మాత్రం నచ్చలేదు. కాకపోతే ఆ సినిమా దర్శకుడు అయినటువంటి కిషోర్ తిరుమల మరియు ఆ సినిమాలో హీరో గా నటించినటువంటి శర్వానంద్ కోసం మాత్రమే ఆ సినిమాను నేను ఒప్పుకున్నాను అని తెలియజేసింది. ఇకపోతే శర్వానంద్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఆడాళ్లు మీకు జోహార్లు సినిమా మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయినప్పటికీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలం అయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం ప్రభావం చూపలేక పోయింది.

ఇకపోతే కొంత కాలం క్రితమే రష్మిక ... రన్బీర్ కపూర్ హీరో గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన యానిమల్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించగా ఈ మూవీ భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ పుష్ప పార్ట్ 2 ... నాగార్జున , ధనుష్ , శేఖర్ కమ్ముల కాంబో లో రూపొందుతున్న సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: