ఆ రెండు తేదీలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్న "సరిపోదా శనివారం" యూనిట్..!

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సరిపోదా శనివారం అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఎస్ జే సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన చాలా భాగం షూటింగ్ పూర్తి అయినప్పటికీ ఈ మూవీ బృందం ఈ సినిమా విడుదల తేదీని మాత్రం ప్రకటించలేదు. ఇకపోతే ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా విడుదలకు రెండు తేదీలను అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప పార్ట్ 2 మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు చాలా రోజుల క్రితమే ఈ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కాకపోతే ఈ సినిమా ఆగస్టు 15 వ తేదీన విడుదల అయ్యే అవకాశాలు లేవు అని ఓ వార్త వైరల్ అవుతుంది.

దానితో ఒక వేళ పుష్ప పార్ట్ 2 సినిమా కనుక ఆగస్టు 15 వ తేదీన విడుదల కానట్లయితే ఆ తేదీన సరిపోదా శనివారం మూవీ ని విడుదల చేయాలి అనే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు ఒక వేళ పుష్ప పార్ట్ 2 మూవీ ఆగస్టు 15 వ తేదీన విడుదల అయినట్లు అయితే సరిపోదా శనివారం సినిమాని ఆగస్టు 29 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే గతంలో నాని , వివేక్ కాంబోలో అంటే సుందరానికి అనే మూవీ రూపొంది మంచి విజయాన్ని అందుకుంది. దానితో వీరి కాంబో లో రూపొందుతున్న సరిపోదా శనివారం సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: