'పుష్ప2'.. ఐటమ్ సాంగ్ సంగతేంటి ?

Anilkumar
టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో ఒకటైన 'పుష్ప2' ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. పార్ట్-1 భారీ సక్సెస్ అవ్వడంతో 'పుష్ప2' ని మరింత గ్రాండ్ స్కేల్లో తెరకెక్కిస్తున్నారు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది. కాగా ఇటీవల జరిగిన ఓ షెడ్యూల్లో 'పుష్ప2' ఐటమ్ సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేసినట్లు న్యూస్ వచ్చింది. పుష్ప ది రైజ్ లో దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన 'ఊ అంటావా మావా' ఐటమ్ సాంగ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఈ సాంగ్ లో సమంత తన గ్లామర్ ట్రీట్ తో అదరగొట్టేసింది.

 దీంతో ఈ సాంగ్ నేషనల్ వైడ్ పాపులర్ అయింది. ఇక ఇప్పుడు 'పుష్ప 2' లోనూ అంతకుమించి ఐటమ్ సాంగ్ ని ప్లాన్ చేసినట్లు ఇప్పటికే వార్తలు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం.. 'పుష్ప 2' మేకర్స్ ఇప్పటివరకు ఎలాంటి ఐటమ్ సాంగ్ ని చిత్రీకరించలేదట. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ ను వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని సుకుమార్ భావిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు దేవి శ్రీ ప్రసాద్ ఇప్పటికే 'పుష్ప 2' ఐటమ్ సాంగ్ కోసం కొన్ని ఐడియాస్ చెప్పినప్పటికీ ఇంకా ఫైనల్ ట్యూన్ రెడీ కాలేదని అంటున్నారు. సుకుమార్ కూడా ప్రస్తుతానికి ఐటం సాంగ్ ని పక్కన పెట్టేసి టాకీ పార్ట్ పైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

ప్రజెంట్ పుష్ప2  షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేక సెట్లో అల్లు అర్జున్ రష్మిక లతో పాటూ ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15 సినిమాను రిలీజ్ చేయాలని మూవీ టీం ఎలాంటి వాయిదాలు లేకుండా నిరంతర షూటింగ్ జరుపుతున్నారు. సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ చేయకుండా ఆగస్టు 15నే సినిమాని రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. సుమారు 350 కోట్ల భారీ బడ్జెట్లో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ రష్మిక లతోపాటు మలయాళ అగ్ర నటుడు ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: