వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రయాణం నేపథ్యంలో మహి వి రాఘవ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సినిమా యాత్ర 2. ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఈ మూవీకి ఎక్కువగా వైసీపీ సపోర్టర్స్ నుంచి సపోర్ట్ లభించే అవకాశం ఉంది. అయితే కామన్ ఆడియన్స్ ఎంత వరకు రిసీవ్ చేసుకుంటారు అనేది చెప్పలేని విషయం.వాస్తవాలకి దగ్గరగా డైరెక్టర్ మహి వి రాఘవ కథ చెబితే కచ్చితంగా జనరల్ ఆడియన్స్ పొలిటికల్ కథలని ఆదరిస్తారు. అయితే అందులో ఫిక్షనల్ ఎలిమెంట్స్ ని జోడించి డ్రామా క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా తేడా అయ్యే ఛాన్స్ ఉంది. యాత్ర సినిమా విషయంలో మహి వి రాఘవ అటువంటి పొరపాట్లు చేయలేదు. అందుకే ఆ సినిమా అన్ని వర్గాల వారికి కనెక్ట్ అయ్యింది. అలాగే వైఎస్ ఆర్ మరణాంతరం ఆ సినిమా రావడం కూడా సక్సెస్ కి ఒక ప్రధాన కారణమని చెప్పొచ్చు.
ఇదిలా ఉంటే యాత్ర 2 సినిమా కోసం నిర్మాత ఏకంగా 50 కోట్ల పైగా ఖర్చు చేసారట. ప్రొడక్షన్ పరంగా బడ్జెట్ తక్కువ అయిన రెమ్యునరేషన్ ల ద్వారానే ఎక్కువ మొత్తం ఖర్చు అయినట్లు సమాచారం తెలుస్తోంది. ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రని చేసిన తమిళ యాక్టర్ జీవాకి ఇంకా మమ్ముట్టికి కలిపి దాదాపు 15 కోట్ల వరకు చెల్లించినట్లు సమాచారం తెలుస్తోంది.ఇక డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ కలిసి పది కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఇలా రెమ్యునరేషన్ ల రూపంలోనే 25 కోట్ల దాకా సినిమాకి ఖర్చయ్యిందంట. మిగిలిన మొత్తం సినిమా మీద పెట్టినట్లు సమాచారం తెలుస్తుంది. ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఖచ్చితంగా 50 కోట్ల పైగా షేర్ రావాలి.మహి వి రాఘవ విషయానికి వస్తే ఆయన మేకింగ్, కంటెంట్ నేరేషన్ లో మంచి ఎక్స్ పర్ట్. ఆ విషయాన్ని ట్రైలర్ చూస్తేనే అర్ధం అవుతుంది.ఫిబ్రవరి 8న ఈ సినిమా థియేటర్స్ లోకి వస్తోంది. ఈగల్ పోటీగా వస్తోన్న కూడా యాత్ర2 సినిమా కోసం వెయిట్ చేసే ఆడియన్స్ ఉన్నారు.