స్టార్ హీరోల కొత్త సినిమాలు.. అన్నీ సమ్మర్ లోనే!

Anilkumar
టాలీవుడ్ టాప్ స్టార్స్ కి సంబంధించి అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు అందరూ ఈ ఏడాదే తమ కొత్త సినిమాలని సెట్స్ పై తీసుకెళ్లబోతున్నారు. ఈ హీరోల సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కుతుండడం విశేషం. ఇంతకీ ఈ ఏడాది సమ్మర్లో సెట్స్ పైకి వెళ్లే స్టార్ హీరోల ప్రాజెక్ట్స్ గురించి పరిశీలిస్తే...
పవన్ కళ్యాణ్  : ప్రస్తుతం పాలిటిక్స్ తో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ ఏడాది జూన్ లో 'OG' సెట్స్ లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ కూడా పూర్తి చేయబోతున్నారట. అంటే ఒకేసారి రెండు సినిమా షూటింగ్స్ ని పూర్తిచేయాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రామ్ చరణ్ : శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన 'గేమ్ చేంజర్' షూటింగ్ చివరి దశలో ఉంది. ఏప్రిల్ నాటికి ఈ సినిమా పూర్తవుతుందని అంటున్నారు. గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తయిన వెంటనే రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాని పట్టాలెక్కించనున్నారట.
ప్రభాస్ : సలార్ సక్సెస్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన ప్రభాస్ గతేడాది రెండు సినిమాలను రిలీజ్ చేశాడు. ఈ ఏడాది కూడా కల్కి, రాజా సాబ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ చివరి దశలో ఉన్నాయి. వీటిని పూర్తి చేయగానే ఈ సమ్మర్ లో సలార్ సీక్వెల్ స్టార్ట్ చేయబోతున్నారట.
NTR : ఎన్టీఆర్ నటిస్తున్న 'దేవర' మూవీ షూటింగ్ ఏప్రిల్ లో పూర్తికానున్నట్లు తెలిసింది. ఈ షూటింగ్ పూర్తి చేసిన వెంటనే తారక్ 'వార్ 2' షూటింగ్లో జాయిన్ కానున్నాడు. యష్ రాజ్ స్పై యూనివర్స్ లో భాగంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా 2025లో విడుదల కానుంది.
మహేష్ బాబు : సూపర్ స్టార్ మహేష్ ఇప్పటికే రాజమౌళి తో పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్స్ మూవీ కోసం కసరత్తులు మొదలెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసుకుని ప్రీ ప్రొడక్షన్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాని సమ్మర్ లోనే స్టార్ట్ చేయనున్నారు.
అల్లు అర్జున్ : 'పుష్ప 2' షూటింగ్ ని జూన్ కల్లా పూర్తిచేసి ఇమీడియట్ గా అట్లీ ప్రాజెక్ట్ తో బిజీ కానున్నాడట బన్నీ. పుష్ప 2 షూటింగ్ ఇప్పటికే లాస్ట్ స్టేజ్ కి వచ్చేసింది. ఆగస్టు నెలలో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: