మెగాస్టార్ ని కాదని.. ఆ హీరోతో దిల్ రాజు సినిమా!

Anilkumar
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు గత కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమాను నిర్మించేందుకు సిద్ధమయ్యారు. స్టోరీ డిస్కషన్ కూడా జరిగాయి. మెగాస్టార్ పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. 'విశ్వంభర'తో పాటే ఇదే సంవత్సరంలో ఈ ప్రాజెక్టుని ప్యార్లెల్ గా ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపించింది. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ ప్రాజెక్టుకి దర్శకత్వం వహించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్ ని అనిల్ రావిపూడి బాగా హ్యాండిల్ చేస్తాడు. దానికి తోడు హీరో ఎలివేషన్స్ సీన్స్ ని కూడా పర్ఫెక్ట్ గా చూపిస్తాడు. రీసెంట్ గా వచ్చిన 'భగవంత్ కేసరి'లో ఎక్కడా మాస్ ఎలిమెంట్స్ మిస్

 అవ్వకుండా బాలయ్యను డిఫరెంట్ క్యారెక్టర్ లో చూపించి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా దిల్ రాజు సినిమా నిర్మించాలని అనుకున్నప్పటికీ బడ్జెట్ ఇష్యూస్ వల్ల ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లు లేటెస్ట్ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందింది. ఈ ప్రాజెక్టు ఎస్టిమేషన్ బడ్జెట్ సుమారు 170 కోట్లకు చేరువైందట. అంత బడ్జెట్ అంటే రిస్క్ అవుతుందని భావించిన దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ విషయంలో వెనక్కి తగ్గాలని నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్ట్ లో లీడింగ్ కాస్ట్ ని మార్చాలని డైరెక్టర్ కి సూచించగా అనిల్ రావిపూడి అదే కథతో విక్టరీ వెంకటేష్ ని హీరోగా

 పెట్టి సినిమా తెరకెక్కిస్తున్నాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వెంకటేష్ - అనిల్ రావిపూడి లది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. ఇప్పటికే వీరి కాంబినేషన్లో ఎఫ్2, ఎఫ్3 వంటి సినిమాలు వచ్చాయి. అయితే ఈసారి వెంకటేష్ ని సోలో హీరోగా పెట్టి అనిల్ రావిపూడి ఓ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్టుని నిర్మిస్తున్నారని, 2025 సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. మరి ప్రాజెక్టుతో అనిల్ రావిపూడి - వెంకటేష్ కాంబో హ్యాట్రిక్ అందుకుంటారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: