పూనమ్ పాండే డెత్ స్టంట్ పై మాజీ భర్త స్పందన ఇదే!

Anilkumar
పూనమ్ పాండే సర్వేకల్ క్యాన్సర్ తో మరణించినట్లు శుక్రవారం నాడు స్వయంగా ఆమె అధికారిక ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ లో పోస్ట్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. 32 సంవత్సరాల వయసులోనే క్యాన్సర్ తో పూనమ్ పాండే మరణించినట్లు తెలియడంతో అందరూ బాధపడ్డారు. ఆమె మృతి వార్తను ఆమె మేనేజర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ ప్రకటనతో చాలామంది ఆందోళన చెందారు. పలువురు సినీ ప్రముఖులు, సినీ అభిమానులు, నెటిజన్లు ఆమె మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతికి నివాళ్ళు సైతం అర్పించారు.
 పూనమ్ పాండే చనిపోయిన మరునాడు బతికే ఉన్నాను అంటూ వీడియో రిలీజ్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. సర్వేకల్ క్యాన్సర్ పై అందరికి అవగాహన కలిగించేందుకే తాను చనిపోయినట్లు పోస్ట్ పెట్టినట్లు పూనమ్ పాండే క్లారిటీ ఇచ్చింది. సర్వేకల్ క్యాన్సర్ కారణంగా దేశంలో ఎంతో మంది స్త్రీలు  ప్రాణాలు కోల్పోతున్నారని.. అటువంటి వారికి ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించాలని ఆలోచనతో తాను చనిపోయినట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు చెప్పింది. అంతేకాదు తన మరణ వార్తతో బాధపడిన, ఇబ్బంది పడిన వారందరికీ క్షమాపణలు తెలిపింది.
 ఓవైపు సోషల్ మీడియాలో పూనం పాండేకి అందరూ చివాట్లు పెడుతుండగా.. పూనమ్ మాజీ భర్త సామ్ బాంబే మాత్రం ఆమెకి అనుకూలంగా మాట్లాడాడు. పూనమ్ మరణ భూతకం గురించి తెలుసుకొని ఆశ్చర్యపోయారా? అని ఓ ఇంటర్వ్యూలో అడిగితే.." లేదు.. అలా చేసినందుకు చాలా సంతోషిస్తున్నా. ఆమె ఇప్పుడు ఇప్పుడు బతికే ఉంది. అది చాలు నాకు. నిజానికి ఈ వార్త విన్నప్పుడు నా మనసులో ఏమనిపించలేదు. ఎందుకంటే అది జరగదని నేను అనుకున్నాను. నాకెందుకు ఏమి అనిపించిందంటే, నేను ప్రతిరోజు ఆమె గురించి ఆలోచిస్తాను. ప్రతిరోజు ఆమె కోసమే ప్రార్థిస్తాను. అలాంటప్పుడు ఏదైనా తప్పు జరిగితే నాకు తెలుస్తుంది" అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: