'పుష్ప2'.. ఎట్టకేలకు సెట్స్ లో అడుగుపెట్టిన కీలక నటుడు

Anilkumar
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప 2' ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా రామోజీ ఫిలిం సిటీ లో సినిమా కొత్త షెడ్యూల్ మొదలుపెట్టారు. ఈ షెడ్యూల్లో మరో కీలక నటుడు జాయిన్ అయినట్లు తెలుస్తోంది. అతను మరెవరో కాదు పుష్ప లో హీరో ఫ్రెండ్ 'కేశవ' పాత్రలో జగదీష్ బండారి. ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన కేసులో జగదీష్ ని పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటనతో పుష్ప మూవీ షాక్ కి గురైంది. ఓ యువతీ ఆత్మహత్య  కేసులో జగదీష్ అరెస్ట్ కావడంతో

 'పుష్ప 2' షూటింగ్ కొద్ది రోజులు ఆగిపోయింది. పుష్ప సీక్వెల్ లో అతని పాత్రకి సంబంధించిన షూటింగ్ ఇంకా జరగాల్సి ఉండగానే జగదీష్ ని పోలీసులు అరెస్ట్ చేయడంతో చిత్ర నిర్మాతలు జగదీష్ ను బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు సైతం వార్తలు బయటకు వచ్చాయి.  ఇక ఎట్టకేలకు బెయిల్ పై బయటికొచ్చిన ఈ నటుడు తాజాగా 'పుష్ప 2' సెట్స్ లో పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్ తో పాటు కీలక నటినటులపై పలు సన్నివేశాలను సుకుమార్ చిత్రికరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే జగదీష్ ఈ షెడ్యూల్లో జాయిన్ అయినట్లు చెబుతున్నారు.

జగదీశ్ బెయిల్ పై బయటికి రావడంతో అతని సీన్స్ ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సుకుమార్ భావిస్తున్నారట. అదే విధంగా ఈ షెడ్యూల్‌లో సునీల్‌తో పాటు కీలక నటీనటులు అంతా పాల్గొంటున్నారట. నిజానికి జగదీష్ అరెస్ట్ అయిన సమయంలో అతని స్థానంలో మరొకరిని తీసుకోనున్నారని, సుకుమార్ సీక్వెల్ లో అతని క్యారెక్టర్ లేకుండా స్క్రిప్ట్ కొంత మార్పులు చేశారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ తాజాగా జగదీష్ 'పుష్ప2' షూటింగ్లో జగదీశ్ జాయిన్ అవ్వడంతో ఈ వార్తలకు పులిస్టాప్ పడినట్లయింది. కాగా పుష్ప 2 మూవీని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్వహిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: