సోషల్ మీడియా ద్వారా లక్షల్లో సంపాదిస్తున్న విజయ్, రష్మిక..!?

Anilkumar
సినీ సెలబ్రిటీలందరూ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమకి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అలా సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత సినీ సెలబ్రిటీల అందరూ ఒక్కొక్కరిగా సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతున్నారు. ఇక అలా ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు ఇప్పటికే మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంటున్నారు. అయితే  సాధారణంగా ఎవరైనా సరే సోషల్ మీడియా అంటే తమకి సంబంధించిన విషయాలని పంచుకుంటున్నారు అని అనుకుంటారు. 

కానీ సినీ సెలబ్రిటీలు తమకి సంబంధించిన విషయాలను పంచుకుంటూ లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్నారు.  సోషల్ మీడియా ద్వారా ఒక్క పోస్ట్ షేర్ చేసి లక్షల్లో సంపాదిస్తున్నారు సినీ సెలబ్రిటీలు . ఇక అసలు విషయంలోకి వెళ్తే..  ఈ క్రమంలోనే మన టాలీవుడ్ సెలబ్రిటీలు ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక్క పోస్ట్ షేర్ చేస్తూ ఎంత మొత్తంలో సంపాదిస్తున్నారనే విషయానికి వస్తే.. నేషనల్ క్రష్ గా గుర్తింపు పొందినటువంటి రష్మిక ఇంస్టాగ్రామ్ లో ఒక్క పోస్ట్ చేస్తే 20 నుంచి 30 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారట. మహేష్ బాబు: మహేష్ బాబుకు సౌత్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి క్రేజ్ మామూలుగా లేదని చెప్పాలి.

ఈయన సినిమాలు మాత్రమే కాకుండా అనేక వ్యాపారాలను ఎండార్స్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంటాడు. ఒక్కో పోస్టుకు రూ.1-2 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ: రౌడీ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నటువంటి ఈయన  ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వ్యాపార రంగంలో కూడా దూసుకుపోతున్నారు. ఈయన ఇంస్టాగ్రామ్ ద్వారా కోటి రూపాయల వరకు ఆదాయం పొందుతున్నారని సమాచారం. ఇక పూజ హెగ్డే ఒక్క పోస్టుకు 30 లక్షలు తీసుకోగా సమంత కూడా అదే స్థాయిలోనే తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: