ఒక్క పోస్ట్ తో విడాకులపై క్లారిటీ ఇచ్చిన జ్యోతిక..!?

Anilkumar
సౌత్ క్యూట్ కపుల్స్ అయిన సూర్య జ్యోతికల జంట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో ఎటువంటి వీడు కైనా మూవీ ఫంక్షన్ అయినా సరే వీరిద్దరూ భార్యాభర్తలుగా హాజరై సందడి చేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఒకరిపై ఒకరు వారి ప్రేమను చూపిస్తూ ఉంటారు. 2d పేరుతో ఒక ప్రొడక్షన్ హౌస్ లో సైతం స్టార్ట్ చేశారు సూర్య. అంతేకాదు దానికి అధినేతగా తన భార్యని ఎంపిక చేశారు. ప్రస్తుతం జ్యోతిక తన బ్యానర్ వ్యవహారాలను చూసుకుంటూ బిజీగా ఉంది. అంతేకాదు ఒకరి సినిమాపై మరొకరు పోస్ట్ చేస్తూ ప్రశంసలు సైతం కురిపిస్తూ ఉంటారు. భార్య భర్తలు గానే కాకుండా ప్రొఫెషనల్ గా కూడా వీరిద్దరూ సమానంగా

వ్యవహరిస్తూ ఉంటారు. అలాంటి ఈ ఒక అద్భుతమైన జంటపై గత కొద్దిరోజులుగా రకరకాల రూమర్స్ వినపడుతున్నాయి. అదే వీరిద్దరూ విడాకులు తీసుకుపోతున్నారు అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు వీరిద్దరూ వేరు వేరుగా ఉంటున్నారు అని కుటుంబం నుంచి బయటకు వచ్చేసారు అని పిల్లలతో వేరుగా ఉంటున్నారు అని ఇప్పటికే చాలా రకాల వార్తలను పుట్టించారు. దీనికి కారణం కూడా ఉంది. ఎందుకంటే ఇటీవల జ్యోతిక తన పిల్లలతో కలిసి ముంబైకి షిఫ్ట్ అయ్యింది. దాంతో ఈ వార్తలు పుట్టుకొచ్చాయి. జ్యోతిక ముంబైకి షిఫ్ట్ అవ్వడంతో భర్తతో తనకు మనస్పర్థలు వచ్చాయని,

ఆ గొడవలు కాస్తా విడాకులకు దారితీశాయంటూ కథనాలు సృష్టించారు. తరచూ దీనిపై చర్చ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో జ్యోతిక ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. భర్త సూర్యతో కలిసి ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. వీరిద్దరు ఫిన్ల్లాండ్ వెళ్లగా అక్కడ మంచు కొండల్లో ఎంజాయ్ చేస్తున్న వీడియోను జ్యోతిక తన ఇన్స్టా వేదికగా షేర్ చేసింది. "2024 ఫుల్ ఆఫ్ ట్రావెల్.. జనవరిలో ఫిన్లాండ్ వెకేషన్" మంచులో భార్యభర్తలు కలిసి ఫుల్ వెకేషన్ మోడ్లో ఉన్నారు. ఫిన్లాండ్ను చూట్టేసిన వెకేషన్లో ఒక్క వీడియోను చూపించింది జ్యోతిక. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: