'రాజా సాబ్' మూవీ అప్డేట్స్ గూర్చి హింట్ ఇచ్చిన డైరెక్టర్....!!
ప్రభాస్ నుంచి ముందుగా ఓ పెద్ద సినిమా (కల్కి 2898 ఏడీ) రానుందని, దీంతో ఇప్పుడు ఆ చిత్రం గురించి ఎక్కువగా మాట్లాడుకోవాలని మారుతీ అన్నారు. ఆ మూవీ తర్వాత ఎలాగూ రాజాసాబ్ గురించి అప్డేట్లు వస్తాయని ఆయన చెప్పారు. అంటే.. కల్కి 2898 ఏడీ మూవీ రిలీజ్ తర్వాత రాజాసాబ్ అప్డేట్లు వస్తాయనేలా మారుతీ హింట్ ఇచ్చారు."ఈ సినిమా (రాజాసాబ్) గురించి కంటే.. ఆయనది ముందు ఒక పెద్ద సినిమా (కల్కి 2898 ఏడీ) ఉంది. దాని గురించి ఎక్కువగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే అది అందరూ చూడాలి. దాని తర్వాత ఎలాగూ మాది ఉంటుంది. వచ్చినప్పుడు చూద్దాం" అని మారుతీ చెప్పారు.అందరికీ నచ్చే డేట్లోనే రాజాసాబ్ సినిమా రిలీజ్ అవుతుందని మారుతీ చెప్పారు. అయితే, ఎప్పటి కల్లా విడుదల చేయాలనుకుంటున్నది స్పష్టం చేయలేదు. అయితే, ఈ ఏడాది డిసెంబర్లోనే రాజాసాబ్ను రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
రాజాసాబ్ సినిమా హారర్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందనుందని రూమర్లు వస్తున్నాయి. ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. రాజాసాబ్ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.రాజాసాబ్ సినిమా నుంచి ప్రతీ నెలా అప్డేట్లు ఇస్తామని ఫస్ట్ లుక్ రివీల్ సమయంలో మారుతీ చెప్పారు. అయితే, కల్కి 2898 ఏడీ రిలీజ్ తర్వాత అప్డేట్లు ఇవ్వాలని అనుకుంటున్నట్టు తాజాగా సంకేతాలు ఇచ్చారు.ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీ చిత్రం మే 9న రిలీజ్ కానుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణ్, దిశా పటానీ, పశుపతి కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో దర్శక ధీరుడు రాజమౌళి కూడా క్యామియో రోల్ చేస్తున్నారు.