"నా సామి రంగ" టికెట్ ధరలపై క్రేజీ న్యూస్..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు. ఈయన తాజాగా నా సామి రంగ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కి విజయ్ బిన్నీ దర్శకత్వం వహించగా ... అశకా రంగనాథ్ ఈ మూవీ లో నాగార్జున కు జోడిగా నటించింది. అల్లరి నరేష్ , రాజ్ తరుణ్ కీలక పాత్రలలో నటించిన ఈ మూవీ కి ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి ఈ చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను , కొన్ని పాటలను విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది.

ఈ మూవీ షూటింగ్ ఇన్ని రోజుల పాటు జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ మూవీ బృందం వారు ప్రత్యక్షంగా ఈ సినిమా ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో నిర్వహించలేదు. నాగార్జున బిగ్ బాస్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా హీరోయిన్ అయినటువంటి ఆశకా రంగనాథ్ మరియు ఈ సినిమా దర్శకుడు విజయ్ బిన్నీ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించనున్న అల్లరి నరేష్ , రాజ్ తరుణ్ ఈ షో కు విచ్చేశారు. ఈ షో ద్వారా ఈ సినిమాను ప్రమోట్ చేసుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో కొంత క్రేజ్ ఉన్న హీరోలు నటించిన సినిమాలను కూడా భారీ టికెట్ ధరలతో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

 దానితో నా సామి రంగ సినిమా టికెట్ ధరలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి అని ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా టికెట్ ధరలు చాలా రీజనబుల్ గా ఉండబోతున్నట్లు దాదాపు చిన్న హీరోల సినిమాలకు ఏ రేంజ్ లో టికెట్ ధరలు ఉంటాయో అదే స్థాయి టికెట్ ధరలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: