షాకింగ్ : ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్న బిగ్ బాస్ విన్నర్..!?

Anilkumar
ఈ ఏడాది జరిగిన సెన్సేషనల్ సంఘటనలో బిగ్బాస్ సెవెన్ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవడం కూడా ఒకటి అని చెప్పొచ్చు. ఇది ఎందుకు సెన్సేషన్ అని అంటున్నాను అంటే.. అతను బిగ్బాస్ షో నుండి బయటికి వచ్చిన తరువాత రచ్చ చేయడం ఇదంతా ఎంతటి సెన్సేషన్ గా మారిందో మనందరం చూసాం. ఒక రైతుబిడ్డగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి విన్నర్ గా బయటకి రావడం అనేది అంత తేలికైన విషయం కాదు. ఇక ఆ వ్యక్తిత్వాన్ని నిలబెట్టలేక అరెస్టు కూడా అయ్యాడు ప్రశాంత్. అయితే ఈ మధ్యనే పల్లవి ప్రశాంత్ జైలు నుండి బయటకు వచ్చేసాడు.

ఈ నేపథ్యంలోనే పల్లవి ప్రశాంత గురించి పాట బిడ్డ బోలె సావలి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు .అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు  ఇందులో భాగంగానే పల్లవి ప్రశాంత్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఇక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడిన పాట బిడ్డ పల్లవి ప్రశాంత్ అరెస్టు వల్ల చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు అని.. అసలు బిగ్ బాస్ కి ఎందుకు వెళ్లాను అని చాలా బాధపడ్డాడు  అని.. పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు పల్లవి ప్రశాంత్ ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకున్నాడు అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు పాట బిడ్డ.  

పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ గా బయటకు రాగానే అతడికి చాలా సినిమా అవకాశాలు వచ్చాయి. హీరోగా రైతుబిడ్డను పరిచయం చేయాలనీ అనుకున్నారు. చాలామంది వ్యాపారవేత్తలు లక్షల్లో గిఫ్ట్స్ పంపిస్తామని అన్నారు. రైతుబిడ్డ హీరోగా చేస్తే ఆ సినిమాకు నేనే సంగీతం ఇవ్వాలని కూడా చెప్పారు. కానీ, ఇంతలోనే ఆ అరెస్ట్, రచ్చ అంతా జరిగిపోయింది. ఈ ఘటనతో పల్లవి ప్రశాంత్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట.. బిగ్ బాస్ కు వెళ్లకపోతే బావుండేది అన్న అంటూ చెప్పాడు. ఇక బెయిల్ నుంచి బయటకు వచ్చాకా.. అభిమానులు అతడి పై పెట్టుకున్న నమ్మకం చూసి చాలా సంతోషపడ్డాడు. త్వరలోనే ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ గా మీ ముందుకు వస్తా” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: