ఎన్టీఆర్ లేకపోయేసరికి లోన్లీ గా ఫీల్ అయ్యాను :: జాన్వీకపూర్
ఎన్నో ఇంటర్వ్యూస్ లో ఈ విషయాన్నీ స్వయంగా జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. అయితే రీసెంట్ గా జరిగిన ఒక సంఘటన ఇప్పుడు ఫిలిం నగర్ లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అదేమిటి అంటే జాన్వీ కపూర్ కి దేవర సెట్స్ ని వదిలి వెళ్లాలని అనిపించట్లేదట. షూటింగ్ పూర్తి అవ్వగానే అప్పుడే వెళ్లిపోవాలా?, ఇంకా షూటింగ్ కాసేపు ఉంటే బాగుంటుంది అని అనేది అట. అంతే కాదు జూనియర్ ఎన్టీఆర్ తో కూడా ఆమె చాలా మంచి స్నేహాన్ని ఏర్పాటు చేసుకుందట.షూటింగ్ సమయం లో ఎన్టీఆర్ తన తోటి నటీనటులతో ఎంత సరదాగా ఉంటాడో మన అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ లోని ఈ లక్షణం జాన్వీ కి బాగా నచ్చిందట. రీసెంట్ గానే ఆమె మీద పలు సన్నివేశాలను చిత్రీకరించారట. ఈ సన్నివేశాలు తీస్తున్నప్పుడు ఎన్టీఆర్ లేదట. ఎన్టీఆర్ లేకపోయేసరికి జాన్వీ కపూర్ చాలా లోన్లీ గా ఫీల్ అయ్యిందట. ఆరోజు మొత్తం డల్ గానే కూర్చొని, ప్యాకప్ చెప్పగానే నిరాశతో ముంబై కి తిరిగి వెళ్లిందట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.