'అఖండ', 'వీర సింహా రెడ్డి' వంటి వరుస బ్లాక్ బాస్టర్స్ మూవీస్ తర్వాత ముచ్చటగా మూడోసారి 'భగవంత్ కేసరి' సినిమాతో హ్యాట్రిక్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ.ఈ సినిమా మొదటి రోజే మొదటి షో నుంచే విశేష స్పందన అందుకుంటూ థియేటర్స్ లో గర్జిస్తోంది. మొదటి రోజే పాన్ ఇండియా సినిమా లియోతో తీవ్ర పోటీ, రెండో రోజు నుంచి ఇంకో పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావుతో తీవ్ర పోటీ ఉన్నపటికీ ఈ సినిమా డీసెంట్ కలెక్షన్లను వసూలు చేస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రెండు రోజుల్లోనే రూ. 50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను ఖాతాలో వేసుకుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో రూ. 51.12 కోట్ల గ్రాస్ వసూళు చేసింది. అలాగే US లో ఈ సినిమా ఏకంగా 700 k డాలర్ల పైగా వసూళ్లు రాబట్టి 1 మిలియన్ డాలర్ల వసూళ్ల వైపు పరుగులు తీస్తుంది.ఇది సీనియర్ హీరోస్ లో సూపర్ డూపర్ రికార్డ్.ఇక ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ అలాగే డిమాండ్ చూసి... తాజాగా మరో కొత్త నిర్ణయం కూడా తీసుకుంది మూవీ టీమ్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర, తెలంగాణలో కలిపి మొత్తంగా 54 స్క్రీన్స్ ను అదనంగా యాడ్ చేస్తున్నారు.ప్రతి సెంటర్ లో థియేటర్లు హౌజ్ ఫుల్ బోర్డ్ లతో నిండిపోతూ బాగా కళకళలాడుతున్నాయి.
ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ అయితే థియేటర్స్ కు పోతెట్టున్నారు. పైగా దసరా సెలవులు కావడం ఈ సినిమాకు మరింత కలిసి వచ్చింది. అందుకే కుటుంబ ప్రేక్షకులు వారి పిల్లలతో కలిసి భారీగా తరిలి వెళ్తున్నారు. వచ్చే మూడు రోజులు ఉద్యోగాలు చేసుకునేవారికి కూడా హాలీడేస్ కావడం ఈ సినిమాకి మరింత బాగా కలిసి వచ్చినట్టు అయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు వసూళ్లు భారీగా పెరిగే అవకాశం ఉంది.ఇకపోతే ఈ చిత్రంలో బాలకృష్ణ తో పాటు యంగ్ సెన్సేషనల్ శ్రీలీల మరో ప్రధాన పాత్రలో నటించింది. బాలయ్య-ఈ ముద్దుగుమ్మ తండ్రి కూతురిగా ఎమోషనల్ యాక్టింగ్ తో బాగా అదరగొట్టేశారు. అనిల్ రావిపూడి కథను మాస్ ఎలిమెంట్స్ - సోషల్ మెసేజ్ తో చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ విలన్గా నటించారు. ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ కూడా బాగుంది. షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాని నిర్మించారు.