వరుస హిట్లతో టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సర్కారు వారి పాట వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాని ఎప్పుడో ప్రకటించాడు కానీ ఈ సినిమా ఎన్నో కారణాల వల్ల లేట్ అవుతూ ఈ సంవత్సరం జనవరిలో స్టార్ట్ అయ్యింది.ఎట్టకేలకు ఈ సినిమా స్టార్ట్ అయ్యి రెండు షెడ్యూల్స్ అయితే పూర్తి చేసుకుంది.. కానీ మళ్ళీ సమ్మర్ ముందు రిలీజ్ డేట్ వాయిదా పడింది. అప్పుడు వాయిదా పడడం మళ్ళీ ఇంత వరకు స్టార్ట్ కాలేదు. అంతేకాదు మళ్ళీ ఈ సినిమాపై వస్తున్న వార్తలతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతగానో భయపడ్డారు.. గత కొద్దీ రోజులుగా చాలా కారణాల వల్ల షూటింగ్ స్టార్ట్ కాలేదు.. దీంతో ఈ విషయంలో నిరాశలో ఉన్న ఫ్యాన్స్ కు షూట్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది అని తెలిసి చాలా ఆనందంగా ఉన్నారు.అయితే ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో ముందుగా పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్ లుగా నటిస్తున్నట్టు తెలిపారు.. పూజా మెయిన్ హీరోయిన్ గా ఇంకా శ్రీలీలని సెకండ్ హీరోయిన్ గా తీసుకున్నారు.
అయితే పూజా హెగ్డేని ఈ సినిమా నుండి తీసేయడంతో శ్రీలీల ఇప్పుడు మెయిన్ హీరోయిన్ పాత్రలోకి వచ్చేసింది. అయితే సెకండ్ హీరోయిన్ కోసం త్రివిక్రమ్ టీమ్ పని మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఒక యంగ్ బ్యూటీని తీసుకున్నట్టు సమాచారం తెలుస్తుంది.ఇక ఆమె మరెవరో కాదు మీనాక్షి చౌదరి. ఖిలాడీ, హిట్ 2 వంటి సినిమాలతో ఎంతగానో ఆకట్టుకున్న మీనాక్షి చౌదరి మహేష్ బాబు సరసన అవకాశం అందుకుంటే అది నిజంగా ఆమెకు లక్ అనే చెప్పాలి.. ఈ మూవీలో ముందుగా సంయుక్త మీనన్ పేరు వినిపించిన ఇప్పుడు మాత్రం ఈమెను పక్కకు నెట్టి మీనాక్షి ముందుకు వచ్చినట్టు సమాచారం తెలుస్తుంది.మరి ఈ హాట్ బ్యూటిని నిజంగానే తీసుకున్నారో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే..