మార్చి లో కాదు.. ఆది పురుష్ రిలీజ్ మంత్ ఎప్పుడంటే?
మరి ఇంతటి స్థాయి లో అంచనాలను కలిగిన ఈ సినిమా వాయిదా పడడం నిజంగా అందరిని నిరాశపరుస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా ను వేసవి లో విడుదల చేయడానికి రంగం సిద్ధం అవుతుందని చెబుతున్నారు. ఆదిపురుష్ చిత్రాన్ని పౌరాణిక గాథ రామాయణం నేపథ్యంతో దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందగా ఈ చిత్రాన్ని టీ సిరీస్, రెట్రోపైల్స్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మాణంలో భాగమయ్యారు. కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను ఐమాక్స్, త్రీడీ పార్మేట్ లో వచ్చే ఈ సినిమా మర్చి లో రావడం లేదనే వార్తలు తాజాగా వినిపిస్తున్నాయి. ఈ సినిమాను మే లో విడుదల చేయాలనీ భావిస్తున్నారట. మే 12 వ తేదీన ఈ సినిమా ను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. మరి దీని గురించి తొందరలోనే ఓ అధికారిక ప్రకటన వస్తుందా అనేది చూడాలి. ఇక తెలుగు లో సంక్రాంతి కి చాలా సినిమాలే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.