పవన్ కు ఒక్కదానికే టైం ఉందట!!

P.Nishanth Kumar
పవన్ కళ్యాణ్ హీరో గా ఇప్పుడు పలు సినిమాలు రూపొందడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఆయన హరి హర వీర మల్లు సినిమా ను మాత్రమే చేయడానికి టైం ఉందన్న విషయం ఇప్పుడు పవన్ అభిమానులను కొంత నిరాశ పరుస్తుంది. ఎలక్షన్ లు దగ్గరకు వస్తూ ఉండడంతో ఆయన ఈ విధమైన నిర్ణయం తీసుకు న్నారట. ఎలక్షన్ల లో దారుణం గా ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేయడానికి అంగీకరించాడు.

ఆ విధంగా ఇప్పటికే రెండు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో ఇప్పుడు చారిత్రాత్మక సినిమా అయినా హరిహర వీరమల్లు సినిమా తో అందరినీ అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా తర్వాత ఆయన ఒప్పుకున్న సినిమాలు కూడా త్వరలోనే చిత్రీకరించబడి ప్రేక్షకులు ముందుకు వస్తా యని ప్రతి ఒక్కరు కూడా అనుకున్నారు కానీ వచ్చే ఎలక్షన్లకు సమయం దగ్గర పడుతూ ఉండడం రాజకీయంగా హోరాహోరీ పోటీ తప్పదు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉండడంతో పవన్ కళ్యాణ్ ఇకపై రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలని భావించాడట.

అందుకే ఈ సినిమా పూర్తి అయిన తర్వాత చేయబోయే సినిమాలను పక్కన పెట్టేయాలని ఆయన భావిస్తున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ప  వన్ కళ్యాణ్ చేయవలసిన సినిమా ఇప్పటికే పక్కన పెట్టేసారని అంటున్నారు. అంతేకాదు సముద్రఖని దర్శకత్వంలో రూపొందించవలసిన సినిమా కూడా దాదాపుగా పక్కన పెట్టే సారని చెబుతున్నారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ ఈ సినిమాలకు సంబంధించి ఒక క్లారిటీ కూడా ఇవ్వబోతున్నారు. క్రిష్ దర్శకత్వం లో రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమా ను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ సినిమా కు కీరవాణి సంగీతం సమకూరు స్తూ ఉండగా ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటి స్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: