విక్రమ్ ఆ సినిమా చేసి తప్పు చేశాడా!!
దానికి తగ్గట్లుగానే ఈ సినిమా ను చేశాడు మణిరత్నం. బాహుబలి సినిమా కి పోటీగా ఈ సినిమా రూపొందించగా పలు మిక్స్డ్ టాక్స్ మధ్య ఈ సినిమా రన్ అవుతుంది. తమిళనాట మాత్రం ఈ సినిమా కి మంచి పేరొచ్చింది. మణిరత్నం ఏ సబ్జెక్ట్ తీసుకున్న దాన్ని అద్భుతంగా తెరకెక్కించడం అయన శైలి. ఇప్పటిదాకా సాంఘీక , ప్రేమకథ సినిమాలను చేసిన ఈ దర్శకుడు తొలిసారిగా చారిత్రాత్మక సినిమా ను టచ్ చేశాడని చెప్పాలి. మణిరత్నం 40 యేళ్ల కెరీర్లో కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియన్ సెల్వన్ నవలను సినిమాగా తెరకెక్కించాలన్నది జీవిత కాలపు కల అది ఇప్పుడు నెరవేరింది.
అయితే ఈ సినిమా అంతా బాగానే ఉన్నా కూడా విక్రమ్ పోర్షన్ చాలా తక్కువుగా ఉండడం అయన అభిమానులను ఏమాత్రం మెప్పించడం లేదు. గట్టిగ చూస్తే ఈ సినిమా విక్రమ్ పదినిమిషాలు కనిపిస్తాడు. అనవసరంగా ఈ సినిమా ను విక్రమ్ ఒప్పుకున్నాడు అని కామెంట్స్ వినపడుతున్నాయి. ఈ సినిమా లో కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, శోభిత ధూళిపాళ వంటి భారీ తారాగణం నటించింది. ఐశ్వర్య రాయ్ ఈ సినిమా లో ఒక మంచి విలన్ పాత్ర పోషించింది అని చెప్పొచ్చు. క్లైమాక్స్లో వచ్చే సముద్రపు సన్నివేశాలను ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. ముఖ్యంగా ముఖ్యంగా నవల చదివ వాళ్లు బాగానే కనెక్ట్ అవుతారు. కామన్ ఆడియన్స్ ఈ సినిమాకు ఏ మేరకు కనెక్ట్ అవుతారనేది చూడాలి.