ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.అయితే కేవలం కొరియాగ్రాఫర్గా మాత్రమే కాకుండా దర్శకుడిగా, నటుడిగా పలు విభాగాల్లో పనిచేస్తూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు లారెన్స్ నటుడుగా ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం ఈయన నాలుగు సినిమాలను సెట్స్ పైన ఉంచాడు.ఇక అందులో ‘రుద్రన్’ మూవీ ఒకటి. అయితే తెలుగులో ‘రుద్రుడు’ పేరుతో విడుదల కానుంది.ఇకపోతే కదిరేశన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సౌత్లోని అన్ని భాషల్లో విడుదల కానుంది.
అయితే ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 23న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇక తాజాగా ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.ఇదిలావుంటే ‘రుద్రుడు’ సినిమాను ముందుగా అనుకున్న తేదీ కాకుండా నాలుగు నెలలు పోస్ట్ పోన్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.అయితే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరిదశలో ఉంది. కానీ,ఇక వీఎఫ్ఎక్స్ పనులకు మరింత సమయం కేటాయించాల్సి రావడంతో రుద్రుడు చిత్రాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు తెలిపారు.
కాగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది 14న తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.అయితే ఈ చిత్రంలో లారెన్స్కు జోడీగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్గా నటిస్తుంది. ఇక జీ.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్పై కదిరేశన్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. ఇదిలావుంటే ప్రస్తుతం లారెన్స్ ‘చంద్రముఖి’ సీక్వెల్తో బిజీగా ఉన్నాడు. ఇక పీ. వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరపుకుంటుంది.అయితే దీనితో పాటుగా ‘అదిగారమ్’, ‘దుర్గ’ సినిమాలను కూడా చేస్తున్నాడు. దర్శకుడిగా ‘కాంచనా’ సిరీస్లోని నాల్గవ భాగాన్ని తెరకెక్కించనున్నాడు.ఇక ప్రస్తుతం ఈ చిత్రం స్క్రిప్ట్ దశలో ఉంది..!!