కృష్ణంరాజు చనిపోతే కనీసం అలా చేయలేరా అంటూ ఆర్జీవీ ఫైర్..!

Divya
టాలీవుడ్ సీనియర్ హీరో ప్రముఖ రాజకీయవేత్త రెబల్ స్టార్ కృష్ణంరాజు సెప్టెంబర్ 11 ఉదయం 3:25  గంటలకు తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఇకపోతే గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న కృష్ణంరాజు మరణం అందర్నీ శోకసంద్రంలో ముంచేసింది.  ఇక కృష్ణంరాజు మరణంతో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  ఇక ఆయన మరణ వార్త విని అభిమానులు కూడా షాక్ కి గురయ్యారు. ఇకపోతే ప్రభాస్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోవడంతో మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు,  రాజకీయ నాయకులు,  కృష్ణంరాజు పార్తివదేహానికి నివాళులర్పించారు. అంతేకాదు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

ఇదిలా ఉండగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలుగు సినీ ఇండస్ట్రీ పై మండిపడడం జరిగింది. కృష్ణంరాజు మృతికి నివాళులు అర్పిస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో షూటింగులు ఆపకపోవడం పై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కృష్ణంరాజు వంటి గొప్ప మహానటుడు కోసం ఒక్కరోజు కూడా షూటింగ్ ఆపలేని స్వార్థపూరిత తెలుగు సినీ పరిశ్రమకు నా జోహార్లు.. సిగ్గు.. సిగ్గు.. అంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్ చేయడం.. ఆయనకు వీడ్కోలు ఇవ్వకపోవడం మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది అని రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు.

అంతేకాదు కృష్ణంరాజు మృతికి నివాళులర్పిస్తూ కనీసం రెండు రోజులైనా షూటింగులు ఆపుదామంటూ తెలుగు సినీ పెద్దలను ట్యాగ్ చేసి మరీ పిలుపునిచ్చారు రాంగోపాల్ వర్మ.. మరి రాంగోపాల్ వర్మ చేసిన ట్వీటుకు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు మద్దతుగా నిలుస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది . ఏది ఏమైనా రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ మాత్రం చాలా గొప్పగా ఉంది అంటూ పలువురు నెటిజన్లు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏది ఏమైనా ఇంత గొప్ప నటుడిని ఇండస్ట్రీ కోల్పోవడం చాలా బాధాకరమైన చెప్పాలి.అంతేకాదు కచ్చితంగా కృష్ణంరాజు మృతికి నివాళులర్పిస్తూ టాలీవుడ్లో షూటింగులు ఆపివేయాలని కూడా నెటిజెన్లు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: