న్యూయార్క్ మేయర్తో బన్నీ.. పిక్ వైరల్?

Purushottham Vinay
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద స్టార్ హీరోగా ఇంకా ఐకాన్ స్టార్ గా 'అల్లు అర్జున్' దూసుకెళుతున్నాడు. ఆయన నటించిన 'పుష్ప' సినిమా దేశావ్యాప్తంగా కూడా పెద్ద ఘన విజయం సాధించింది. అందులో 'తగ్గేదే లే' అనే డైలాగ్ ఇంకా సిగ్నేచర్ అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా యమ పాపులర్ అయ్యింది.టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన 'పుష్ప' సినిమా బాక్సాపీస్ ను బాగా షేక్ చేసింది. సినీ, రాజకీయ, క్రీడ, ఇతర రంగాలకు చెందిన వారు.. 'తగ్గేదే లే' డైలాగ్స్ కూడా పలికారు.తాజాగా..న్యూయార్క్ మేయర్ ఇంకా అలాగే ఇతరులు 'తగ్గేదే లే' అంటూ ఫొజులిచ్చారు. అలాగే అందులో 'అల్లు అర్జున్' కూడా ఉన్నారు. న్యూయార్క్ మేయర్ ను కలవడం చాలా ఆనందంగా ఉందని అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు. ఆయన చాలా స్పోర్టివ్ జెంటిల్ మెన్ అని కూడా కొనియాడారు. 



ఈ సందర్భంగా మేయర్ ఎరిక్ అడమ్స్ కు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు అల్లు అర్జున్ వెల్లడించారు.ఇంకా ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ కు ఓ అరుదైన గౌరవం కూడా దక్కింది. అదేంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఇండియా పెరేడ్ కు బన్నీ నాయకత్వం వహించారు.ఇందుకు సంబంధించిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా న్యూయార్క్ లో 'ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్స్' ఇండియా డే పరేడ్ ని నిర్వహించింది. కలర్ ఫుల్ గా సాగిన ఈ పరేడ్ లో దాదాపు 4 లక్షల మంది ప్రవాస భారతీయులు కూడా పాల్గొన్నారు. తానా ఇంకా నాట్స్ ప్రదర్శించిన శకటాలు ఆకర్షణగా నిలిచాయి.ఇంకా అలాగే వివిధ రకాల జాతీయ జెండాలను ఒకేసారి ప్రదర్శించడం ద్వారా రికార్డు నెలకొల్పారు. ఏటా న్యూయార్క్ లో ఇండియా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అనేవి జరుగుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: