అవకాశాలు లేకపోయినా భారీగా డిమాండ్ చేస్తున్న ఇస్మార్ట్ హీరోయిన్..?

Anilkumar
నభా నటేష్ గురించి మనకి తెలిసిందే. ఈమె తన అందం, అభినయం తో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఇదిలా ఉంటె మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసి కన్నడ మూవీతో సినీ రంగప్రవేశం చేసిందీ బ్యూటీ. ఇకపోతే ఆ తర్వాత `నన్ను దోచుకుందువటే` మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన నభా నటేష్‌..అయితే ఇక గతంలో లో టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనికి జోడీగా `ఇస్మార్ట్ శంకర్‌` మూవీలో మాస్ హీరోయిన్‌గా నటించి ఇస్మార్ట్ పోరిగా గుర్తింపు పొందింది నభా నటేష్ .అయితే డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం.. కాగా 2019లో విడుదలై అంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.

ఇదిలావుంటే  ఈ మూవీ ద్వారా కావాల్సినంత క్రేజ్ సంపాదించుకున్న నభా నటేష్ దశ తిరిగినట్టే అని అంతా అనుకున్నారు.ఇకపోతే  అందరూ అనుకున్నట్లే ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి.అయితే ఈ క్రమంలోనే ఇస్మార్ట్ శంకర్ తర్వాత `అల్లుడు అదుర్స్`, `డిస్కో రాజా`, `సోలో బ్రతుకే సో బెటర్`, `మాస్ట్రో` చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది.అయితే  కానీ, ఈ నాలుగు చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యాయి.అయితే ఇక  దాంతో దర్శకనిర్మాతలు నభా వైపు చూడటం మానేశారు.ఇదిలా ఉంటె ప్రస్తుం ఈమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు.

 అయితే ఇక  ఆఫర్స్ లేకపోయినా ఈ బ్యూటీ రెమ్యునరేషన్ మాత్రం భారీగా డిమాండ్ చేస్తుందట.ఏంటంటే  రూ. కోటి ఇస్తేనే సినిమాకు సైన్ చేస్తానని చెబుతోందట. ఇక దాంతో మీడియం బడ్జెట్ లో తెరకెక్కే చిత్రాల్లోనూ ఆమెను తీసుకోవడం మానేశారట.అంతేకాకుండా  ఆమె రెమ్యునరేషన్ తగ్గించుకుంటే మాత్రం అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉన్నాయని అంటున్నారు.ఇక ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.చూడాలి మరి ఈ అమ్మడు రెమ్యూనరేషన్ తగ్గించుకొని మళ్ళీ సినిమాలు చేస్తుందా లేదా అని..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: