త్రివిక్రమ్ ఈ హీరోయిన్ కు అన్యాయం చేస్తున్నారు..!!

Divya
అలా వైకుంఠపురం వంటి చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి ఏ సినిమా రాలేదు. అయితే ఇటీవల తన తదుపరి ప్రాజెక్టును మహేష్ బాబు తో తీయబోతున్నట్లు గా ప్రకటించడం జరిగింది. దాదాపుగా 12 సంవత్సరాల తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో నటిస్తున్న చిత్రమిది. గతంలో మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఖలేజా, అతడు వంటి సినిమాలు విడుదలయ్యే బాగానే అలరించాయి. దీంతో ఈసారి హ్యాట్రిక్ సినిమా పైన గురిపెట్టారు. ఇక మహేష్ బాబు 28 వ సినిమాని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు త్రివిక్రమ్. SSMB -28 సినిమాకు సంబంధించి వర్కింగ్ టైటిల్తో ఫిబ్రవరి నెలలో ప్రారంభించడం జరిగింది.

అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా మొదలు కానుంది. ప్రస్తుతం మహేష్ ఫ్యామిలీ తో వెకేషన్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆయన తిరిగి వచ్చిన వెంటనే ఈ సినిమా మొదలు కానున్నట్లు చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్పై చిన్న బాబు నిర్మిస్తున్నారు. ఇందులో కథానాయికగా పూజా హెగ్డే ఖరారు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ చిత్రం నుంచి మరొక వార్త బయటకు వినిపిస్తోంది.. అదేమిటంటే మహేష్ కు జోడిగా పూజాహెగ్డే తొలగించి ఆమె స్థానంలో ప్రియాంక అరుల్ మోహన్ తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
నాని హీరోగా తెరకెక్కించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో ఈమె మొదటి సారిగా టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత శర్వానంద్ శ్రీకారం సినిమాలో నటించింది. కానీ ఈ చిత్రాలు ఆమెకు అంతగా కలిసి రాలేకపోయాయి ఇక తమిళంలో శివకార్తికేయన్ జోడిగా డాక్టర్, డాన్ వంటి సినిమాలలో నటించింది ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. దీంతో ఈమె క్రేజీ భారీగా పెరిగిపోయింది.అందుచేత ఇటు టాలీవుడ్ కోలీవుడ్ లో కూడా వరుస ఆఫర్లు వెలువడుతున్నాయి ఈ ముద్దుగుమ్మ కి. ఒకవేళ పూజ స్థానంలో ప్రియాంక నటించినట్లు అయితే ఈమె కావడం మరింత పెరుగుతోందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: