'బోయపాటి - రామ్' ఊరమాస్ మూవీ షురూ.. రెగ్యులర్ షూటింగ్ ఎప్పడంటే..?

Anilkumar
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో చాక్లెట్ బాయ్ ఇమేజ్ ను పక్కనపెట్టి.మాస్ హీరోగా అవతారం ఎత్తాడు రామ్ పోతీనేని.ఇక అప్పటి నుంచీ మాస్ కథలపైనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.గతంలో ఇస్మార్ట్ శంకర్ తరువాత రామ్ సినిమాలు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అయితే దాంతో ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో.. పాన్ ఇండియా సినిమాను సెట్స్ ఎక్కిస్తున్నాడు రామ్.ఇక ఈమూవీ ఓపెనింగ్ ఈరోజు( జూన్ 1) ఘనంగా జరిగింది.ఇకపోతే దర్శకులు బోయపాటి శ్రీను అడపా దడపా డిజాస్టర్స్ ఫేస్ చేసినా.. ఆయన సినిమా తీస్తే హీరోలకు మాస్ ఇమేజ్ వచ్చేస్తుంది. తాజాగా ఇప్పుడు ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను పాన్ ఇండియా సినిమా ప్రారంభించారు.

అయితే బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కాంబినేషన్‌లో పాన్ ఇండియా సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 9గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ రోజు పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం అయ్యింది.కాగా  బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన అఖండ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం, థియేటర్లకు మళ్ళీ పూర్వ వైభవం రావడంతో ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంది.ఇక  ఆ సినిమా తర్వాత బోయపాటి చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఇకపోతే దర్శకుడిగా ఆయన 10వ సినిమా. అంతేకాదు హీరో రామ్ 20వ సినిమా ఇది.ఇక  ది వారియర్ తర్వాత రామ్ నటిస్తున్న మూవీ ఇది.

ఇకపోతే   ఈరోజు సినిమా ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగింది. కాగా హీరో రామ్ మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్ క్లాప్ ఇచ్చారు. అయితే దర్శకులు బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. ఇకపోతే ఈ ప్రారంభోత్సవ వేడుకలో దర్శకులు లింగుస్వామి, వెంకట్ ప్రభు స్క్రిప్ట్ అందజేశారు. కాగా ఈనెలలోనే రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు టీమ్.ఇక్క్ ఇదిలావుంటే ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా ప్రారంభించడం సంతోషంగా ఉంది. అయితే ది వారియర్ తర్వాత మా హీరో రామ్‌తో వెంటనే మరో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఇక మా సంస్థలో ప్రతిష్ఠాత్మక చిత్రమిది. అయితే భారీ బడ్జెట్ తో, హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమా చేయబోతున్నాం. ఇకపోతే తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున సినిమా విడుదల చేస్తాం అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: