ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..
ముందుగా బాలివుడ్ బ్యూటీ అలియా భట్ ను హిరోయిన్ గా అనుకున్నారు. ఇటీవల ఆమె పెళ్లి చేసుకోవడం తో ఆమె ఈ సినిమా నుండి తప్పుకున్నట్లుగా చిత్ర వర్గాల్లో వార్తలు వినిపించాయి. ఇక ఈ సినిమా నుండి ఆలియా తప్పుకోవడంతో ఆమె స్థానంలో అందాల భామ రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుందనే టాక్ వినిపించింది. కానీ ఆమె డేట్లు ఖాళీ లేక పోవడం తో ఆమె ప్లేస్ లో మరో హీరోయిన్ ను తీసుకు రానున్నాడు.. తాజాగా ఈ సినిమా లో హీరోయిన్ గా అందాల భామ సాయి పల్లవిని తీసుకు వచ్చేందుకు దర్శకుడు కొరటాల ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు కూడా జరిపేందుకు కొరటాల రెడీ అవుతున్నాడట.
నటనతో పాటు డ్యాన్స్లోనూ ఇరగదీసే సాయి పల్లవి అయితే తారక్ పక్కన చాలా అద్భుతం గా ఉంటుందని కొరటాల భావిస్తున్నారట.వీరిద్దరి కాంబినెషన్ పై ఇప్పటికే గుసగుసలు వినిపిస్తున్నాయి. తారక్ తో సాయి పల్లవి కనుక నటిస్తె స్రీన్ మాములుగా వుండదు అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటున్నారు. నిజంగానే ఈ కాంబినేషన్ సెట్ అవుతుందో లేదో చూడాలి. ఏది ఏమైనా కొరటాల తో సినిమా రిస్కెమో అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.. చివరికి ఏమవుతుందో చూడాలి.