సర్కారు వారి పాట సినిమా మరో నాలుగు వారాల్లో థియేటర్స్ లో దిగనుంది. ఈ నేపథ్యంలో సినిమా హక్కులు అమ్మకం మొదలైంది. వరుస హిట్స్ తో ఊపుమీదున్న సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట మూవీ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక అదే స్థాయిలో థియరిటికల్ హక్కులకు డిమాండ్ కూడా నెలకొంది. ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ప్రకారం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమా థియేట్రికల్ హక్కులను జీఎస్టీతో కలిపి నైజాం ఏరియాలో రూ.30 నుండి 35 కోట్ల రూపాయలకు కోనుగోలు చేశారని సమాచారం తెలుస్తుంది. అలాగే ఆంధ్ర ఏరియాలో రూ.50 నుంచి 60 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం విపిస్తోంది.అయితే సూపర్ మహేష్ మహేష్ బాబు (Mahesh babu) మూవీకి ఇంత మొత్తంలో చెల్లించి హక్కులను సొంతం చేసుకోవడంపై చాలా పెద్ద చర్చే జరిగిందట. సినిమా ఏదైనా తేడా కొడితే ఎలా అని కూడా డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా మేకర్స్ను ప్రశ్నించారు. అయితే సినిమా చాలా బాగా వచ్చిందని, ఒకవేళ కనుక ఏమైనా ఇబ్బందులు వచ్చిన తాము అండగా ఉంటామని డిస్ట్రిబ్యూటర్స్కి ఈ సినిమా మేకర్స్ భరోసా ఇవ్వడంతో వాళ్లు చాలా ఎక్కువ మొత్తంలో థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
అలాగే తెలుగుతో పాటు తమిళంలో కూడా సర్కారు వారి పాట సినిమాని విడుదల చేస్తున్నారు. తమిళ వెర్షన్ రైట్స్ అయితే పది కోట్లకు పైనే అమ్ముడు పోయే అవకాశం కలదు. ఇక మహేష్ బాబు ఎప్పటినుంచో ఓవర్ సీస్ కింగ్ గా ఉన్నారు. వరల్డ్ వైడ్ గా సర్కారు వారి పాట సినిమా రూ. 150 నుండి 170 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకునే అవకాశం ఉంది. పాన్ ఇండియా ఇమేజ్ లేకున్నా ఈ రేంజిలో బిజినెస్ జరగడం అంటే మామూలు విషయం కాదు.ఏపీ ఇంకా తెలంగాణ రాష్ట్రాల్లో టికెట్స్ ధరలు పెరిగిన నేపథ్యంలో టార్గెట్ రీచ్ కావడం మహేష్ కి అంత కష్టమైన పనేమీ కూడా కాదు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వేసవి కానుకగా మే 12న విడుదల కానుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. విడుదలైన రెండు పాటలు కూడా ఎంతో అద్భుతమైన రెస్పాన్స్ అందుకున్నాయి.