ప్రభాస్ స్టెప్ దేనికి దారి తీస్తుందో.. పాన్ ఇండియా!!

P.Nishanth Kumar
ప్రభాస్ హీరోగా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు వరుసగా తెరకెక్కుతున్నాయి. ఆయన హీరోగా నటించిన రాధే శ్యామ్ చిత్రం మార్చి 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సాహో చిత్రం తర్వాత ఆయన నటించిన సినిమా చాలా రోజుల తర్వాత థియేటర్లలో విడుదల కాబోతు ఉండగా మొదటి నుంచి ఈ చిత్రం పై భారీ స్థాయిలో అంచనాలు ప్రేక్షకులలో నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగా ఈ చిత్రం నుంచి వచ్చిన అప్ డేట్స్ సైతం అందరినీ విపరీతంగా అలరించాయి.

ఇక ఈ సినిమా తర్వాత ఆయన ఏకంగా నాలుగు సినిమాలను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళాడు. ఇప్పటికే ప్రశాంత్ దర్శకత్వంలో సలార్ చిత్రాన్ని దాదాపుగా పూర్తి చేశాడు. అంతేకాదు ఆయన భారీ బడ్జెట్ తో బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ చిత్రం సైతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్నాయి. మరొకవైపు నాగ్ అశ్విన్ దర్శకత్వం లోని ప్రాజెక్టు కే చిత్ర షూటింగ్ కూడా ఇటీవల మొదలైంది ఆ విధంగా ఒకేసారి మూడు భారీ చిత్రాలను చేస్తూ ప్రభాస్ తన కెరియర్ ను ఎవరికీ అందనంత ఎత్తుకు తీసుకు వెళ్తున్నాడు.

ఇక ఆయన అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే చిత్రాన్ని కూడా ఓకే చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. అయితే అనుకోని విధంగా ప్రభాస్ ఓ చిన్న బడ్జెట్ సినిమాను అందులోనూ చిన్న దర్శకుడితో చేయబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.అలా మారుతి దర్శకత్వం లోని సినిమా యొక్క అనౌన్స్మెంట్ తొందర్లోనే రాబోతుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ప్రభాస్ తీసుకున్న ఈ నిర్ణయం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. మారుతి కూడా ప్రేక్షకులను భారీ గా అలరించే సినిమాలనే చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రకటన వస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: