మీటూ : పురుషులు మీరు కూడా ఓపెన్ అవ్వండి?

praveen
సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంటుంది అన్నది ఇప్పుడు కాదు కొన్ని దశాబ్దాల నుంచి వినిపిస్తున్న మాట. ఇండస్ట్రీలోకి వచ్చే ఎంతో మంది హీరోయిన్లకు ఊహించని రీతిలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అని చెబుతూ ఉంటారు ఎంతమంది. అయితే ఒకప్పుడు ఇలాంటి గుసగుసలు మాత్రమే వినిపించాయి. కానీ ఇటీవలి కాలంలో మాత్రం ఎంతో మంది స్టార్ హీరోయిన్లు తమ కెరీర్ తొలినాళ్లలో ఎదురైన చేదు అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉండడం సంచలనంగా మారింది. ఇప్పుడు వరకు ఎంత మంది హీరోయిన్లు ఇలా మీటూ ఉద్యమంలో భాగంగా ఓపెన్ అయ్యారు.. ఇక పురుషులు ఇప్పుడు మీరు కూడా ఓపెన్ అవ్వండి అంటూ చెబుతుంది ఇక్కడ ఒక నటి.



 బాలీవుడ్లో కంగనా రనౌత్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. మాటలు తూటాల్లా పేలస్తూ ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది.  అచ్చంగా ఇలాగే తూటాలాంటి లాంటి మాటలతో పక్షులకు సుపరిచితురాలు గా మారిపోయింది నటి సౌందర్య రాశి దివ్యాంకా త్రిపాఠి. యే హై మొహబ్బతే లో నటించి నటిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో ఇటీవల ఈ హీరోయిన్ కూడా ఓపెన్ అయింది. నా నాశనం చేసేందుకు ఎంతోమంది ప్రయత్నాలు చేశారు అంటూ చెప్పుకొచ్చింది.


 అదే సమయంలో సరికొత్త విషయం చెప్పి బాంబు పేల్చింది సౌందర్యరాశి దివ్యాంకా త్రిపాఠి  లైంగిక వేధింపులు మహిళలకు మాత్రమే కాదు పురుషులకు కూడా తప్పడం లేదు అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇటీవల కాలంలో మహిళలు తెర మీదికి వచ్చి అన్ని నిజాలు  చెబుతున్న సమయంలో ఇక ఇప్పుడు పురుషులు కూడా నోరు తెరవాల్సిన సమయం వచ్చింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.  నేను భయటకి వచ్చి మాట్లాడినప్పుడు నా భర్త భయపడతారు.. ఏం మాట్లాడుతానో అని..  నేను మాట్లాడకపోతే ఎవరూ వచ్చి మాట్లాడుతారు. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను ఎన్నో సవాళ్లను ఎదుర్కొని పోరాటం చేశాను.  మీటూ తో ఎంతో మంచి జరిగింది. ఇప్పుడు ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించాలాంటేనే భయపడుతున్నారు అంటూ చెప్పుకొచ్చింది ఈ నటి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: