ఇటీవలే బంగార్రాజు సినిమాతో సక్సెస్ అందుకుని పుల్ జోష్ మీద ఉన్నాడు అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన బంగార్రాజు సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై అద్భుత విజయాన్ని అందుకున్నది. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జునతో కలిసి నటించి ఆకట్టుకున్నాడు నాగచైతన్య. గత ఏడాది శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసినదే. ఇక బ్యాక్ టూ బ్యాక్ హిట్స్తో దూసుకుపోతున్న చైతన్య ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీకి మెమరబుల్ మూవీ మనం సినిమా అందించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు థాంక్యూ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ను ఖరారు చేసారు. ఈ చిత్రంలో చైతు హాకీప్లేయర్గా కనిపించనున్నాడు అని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.
ఇక ఈ సినిమాలో అందాల భామ రాశిఖన్నా హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం రష్యాలో ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కొనసాగుతున్నది. అక్కడ హీరో, హీరోయిన్ల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు చైతన్య మరొక దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.ఇటీవల తమిళంలో వచ్చిన మానాడు సినిమా మంచి విజయం సాధించిన విషయం అందరికీ తెలిసినదే. అయితే ఆ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించగా... ఇప్పుడు ఆయన దర్శకత్వంలోనే చైతన్య మరొక సినిమా చేయబోతున్నాడు అని తెలుస్తున్నది. ఆయన ఇటీవల నాగ చైతన్యను కలిసి కథ చెప్పాడని.. చైతూ ఓకే చెప్పాడం జరిగిపోయిందని పలువురు పేర్కొంటున్నారు. మరొక వైపు నాగ చైతన్యతో సినిమా చేయడానికి ఇప్పటికే పరశురామ్, నందిని రెడ్డి, విజయ్ కనక మేడల సిద్ధంగానే ఉన్నారు. అదేవిధంగా నాగచైతన్య వెబ్సిరీస్లు కూడా ప్రారంభించిన విషయం తెలిసినదే.
అదేవిధంగా నాగచైతన్య-సమంత విడాకుల వ్యవహారం ఏదో ఒక విధంగా తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ వ్యవహారం పై నాగార్జున కూడా స్పందించినట్టు కామెంట్లు మీడియాలో సైతం ప్రచారమయ్యాయి. ఈ విషయం పై ఇటీవలే సోషల్ మీడియాలో ఖండించారు కూడా. ఈ తరుణంలోనే లీగల్గా ముందుకు వెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం.