అఖండ: కొన్ని పాత్రల మినహా... తేలిపోయిన సినిమా?

VAMSI
నందమూరి నట సింహం, మాస్ దర్శకుడు బోయపాటి శీను కాంబినేషన్లో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన చిత్రం 'అఖండ'. వీరి కాంబో నుండి ఇప్పటికే సింహా, లెజెండ్ వంటి రెండు పవర్ ఫుల్ సూపర్ హిట్ చిత్రాలు రాగా ఇది మూడో సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని అంటాయి. దాంతో ఫ్యాన్స్ లో సినిమా ఎలా ఉండబోతోంది అన్న టెన్షన్ మరింత పెరిగి పోయింది. ఎప్పుడు ఎప్పుడు అనుకున్న చిత్రం ఎట్టకేలకు నేడు విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది అని అంటే అంచనాలకు మించిన ట్రీట్ ను ఇచ్చేశారు మా బాలయ్య అంటున్నారు అభిమానులు. థియేటర్ల వద్ద జై బాలయ్య ... జై జై బాలయ్య అంటూ నినాదాలు పలుకుతున్నారు.
బాలయ్యను ఎలా చూపెడితే అభిమానులకు నచ్చుతుందో బోయపాటికి బాగా తెలుసు స్టోరీని ఆయన రూపుదిద్దిన   విధానం అబ్బో హైలెట్టు... స్క్రీన్ పై బాలయ్యను చూసి జై కొట్టు అంటూ హంగామా చేస్తున్నారు ఆడియన్స్. ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రల్లో బాలయ్య కనిపిస్తారని ముందే తెలిసిన విషయమే, అయితే అఘోర పాత్రలో బాలకృష్ణ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. ఆ పాత్ర కథ ఎలా ఉండబోతుంది అన్న ఆసక్తి అందరిలో ఉండగా, నేడు వెండి తెరపై అఖండ సినిమా చూసిన ప్రేక్షకులంతా అఘోర పాత్రలో భళా బాలయ్య  అనిపించారు.
సినిమా చూడని వారు అంచనాలు భారీగా పెట్టుకుంటున్నారు. అయితే వాస్తవంగా సినిమా అయిన తర్వాత ప్రేక్షకుల నుండి వస్తున్న రివ్యూ డిఫరెంట్ గా ఉంది. కేవలం బాలయ్య, శ్రీకాంత్, జగపతి బాబు లాంటి వారి వల్ల కొంత భాగం పర్వాలేదు. అయితే ఓవరాల్ గా అనుకున్న విధంగా సినిమా లేదని తెలుస్తోంది. ఎప్పటిలాగే బోయపాటి శీను ఎక్కువ భాగం హింసకు ప్రాధాన్యత ఇచ్చి ప్రేక్షకులకు బోర్ కొట్టించారు అంటున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: