బాలయ్య, ఎన్టీఆర్ కాంబినేషన్ సెట్టయినట్టేనా...?

murali krishna
మల్టీస్టారర్ సినిమాలు ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యాయని తెలుస్తుంది.నిజానికి మల్టీస్టారర్ సినిమాలకు నాంది పలికింది నందమూరి కుటుంబమేనని తెలుస్తుంది.

ఆ రోజుల్లో సీనియర్ ఎన్టీఆర్ ఎన్నో మల్టీస్టారర్ చిత్రాలలో నటించారట.అలాగే తాను దర్శకత్వం వహించే చిత్రాల్లో కూడా ఎక్కువగా వేరే హీరోలనే పెట్టి సినిమాలు తీశారని ఆ రకంగా తొలి తరంలోనే మల్టీస్టారర్ లకు తెలుగు సినిమా ఇండస్ట్రీ పెట్టింది పేరు అయిందని సమాచారం.

అదే ఆనవాయితీని కొనసాగిస్తూ కృష్ణ, శోభన్ బాబు కూడా మల్టీస్టారర్ చిత్రాల్లో కలిసి నటించారట.. ఇక ఆ తర్వాత తరం హీరోలు మాత్రం మల్టీస్టారర్ల జోలికి పోలేదని తెలుస్తుంది.నిన్నటి తరం స్టార్ హీరోలుగా చలామణి అయిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకీ, నాగ్ లు ఎవరూ కలిసి నటించలేదట.గతంలో నాగార్జున - బాలయ్య కలిసి ఓ సినిమా చేయాలనుకున్నారని సమాచారం.

అదే గుండమ్మ కథ సీక్వెల్ అని అయితే, కథ పర్ఫెక్ట్ గా రాకపోవడంతో మొత్తానికి నాగార్జున ఆ సినిమా చేయలేను అంటూ సైడ్ అయిపోయాడట.. దాంతో బాలయ్య కూడా ఆ సినిమాను పక్కన పెట్టేశాడట.. ఇక చాలా కాలంగా బాలకృష్ణ - జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తే బాగుంటుంది అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయని తెలుస్తుంది..

నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో కల కంటున్న కలయిక ఇది అని తెలుస్తుంది.. ఇద్దరు నందమూరి హీరోలు కలిసి ఒకే స్క్రీన్ పై కనిపిస్తే.. రికార్డులు బద్దలు అవ్వడం ఖాయం అంటూ సినిమా పండితులు కూడా ముక్తకంఠంతో ముక్తాయిస్తున్నారట.భవిష్యత్తులో ఈ కాంబోలో ఓ సినిమా రావొచ్చు అని నమ్మకం అయితే ఉందట ఇలాంటి తరుణంలో 'అఖండ' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య బన్నీతో కలిసి పోయిన విధానం చూసి అందరూ షాక్ అయ్యారని సమాచారం.

బాలయ్యలో చాలా మార్పు వచ్చిందట. చిన్న హీరోలను కూడా గౌరవిస్తున్నాడని అలాంటప్పుడు కచ్చితంగా తారక్ ను కూడా కలుపుకుపోతాడు అనే నమ్మకం కూడా నెటిజన్లలో ఎక్కువ అవుతుందట.. పైగా బాలయ్య నిన్న 'ఆర్ఆర్ఆర్' సినిమా గురించి ప్రస్తావిస్తూ కూడా తమ్ముడు రామ్ చరణ్ అని అలాగే ఆ తర్వాత మన జూనియర్ ఎన్టీఆర్ అని పలికాడట.కాబట్టి వీరిద్దరి కలయికలో సినిమా రావొచ్చని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: