కోటి కొడుకు కోసం సాహసం చేస్తున్న చిరంజీవి..!!

Divya
కెరీర్ మొదటి నుంచి విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ కోటి కుమారుడు.ఆయన పేరు రాజీవ్ సాలూర్. ఈయన హీరో గా ఎంట్రీ ఇచ్చేందుకు టైగర్ హిల్స్ అనే ప్రొడక్షన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ వన్ అనే ఒక కొత్త సినిమాని తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాని డైరెక్టర్ కిట్టు నల్లూరి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కథ సరికొత్త కథతో ప్రేక్షకులను అలరించబోతోంది అన్నట్లుగా తెలియజేశారు.

ఈ సినిమాకి నిర్మాతగా వీరేష్ వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా వర్ష విశ్వనాథ్ నటిస్తోంది. ఇంకా ముఖ్యమైన పాత్రలో రాజా రవీంద్ర, రాజశ్రీ మిగతా కొంతమంది ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ పనులు కూడా చాలా స్పీడ్ గా జరుపుతున్నారు అన్నట్లుగా సమాచారం. డిఫరెంట్ స్టోరీ గల ఈ సినిమాకు మెగాస్టార్ సపోర్ట్ చేయడం చాలా గమనార్హం.

ఈ సినిమా సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేసే విధంగా ప్లాన్ చేశారు ఆ చిత్ర యూనిట్ సభ్యులు. ఇక ఈ నెల 11వ తేదీన సాయంత్రం 6 గంటలకు హైదరాబాదులో విడుదల చేయబోతున్నట్లు గా  ఒక స్పెషల్ పోస్టర్ ద్వారా తెలియజేశారు చిత్ర యూనిట్ సభ్యులు.

ఇక ఈ మూవీకి సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాకి ఇదే హైలెట్ గా  నిలవనుంది. ఇక ఈ చిత్ర దర్శక నిర్మాతలు మాత్రం ఒక గొప్ప సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలియజేస్తున్నారు. ఇక ఈ సినిమాలో రాజీవ్ సాలూర్ పాత్ర ఈ సినిమాకి ప్లస్ గా ఉంటుందని నిర్మాత వీరేష్ తెలియజేశారు. ఈ సినిమాకు సంబంధించి అతి త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని అన్నట్లుగా చిత్రయూనిట్ సభ్యులు తెలియజేశారు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీగా మహేశ్వర్ పనిచేస్తున్నారు. ఇప్పటికే మాటలు మాత్రం పవన్ అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: