మన హీరోలు ఈ మల్టీ ప్లెక్స్ ల మీద పడ్డారేంటి!!

P.Nishanth Kumar
ఇప్పటి తరం టాలీవుడ్ హీరోలు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించడమే కాకుండా ఇతర వ్యాపారాలలో కూడా పెట్టుబడులు పెడుతూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. చాలా మంది హీరోలు హోటల్ బిజినెస్ లో మల్టీప్లెక్స్ బిజినెస్ లో ఇతర వ్యాపార రంగాలలో రాణించడానికి పెట్టుబడులు పెడుతున్నారు. ఆ విధంగా ఇటీవల కాలంలో మన హీరోలు ఎక్కువగా మల్టీప్లెక్స్ బిజినెస్ పై మొగ్గు చూపుతుండటం ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశం అయింది. 

ఇప్పటికే మహేష్ బాబు విజయ్ దేవరకొండ లు మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి దిగారు. ఏఎంబీ అనే పేరుతో మహేష్ బాబు ఏవీడీ అనే పేరుతో విజయ్ దేవరకొండ మల్టీ ప్లేక్స్ థియేటర్ ను నిర్మించి మల్టీప్లెక్స్ లోనే సరికొత్త ట్రెండ్ ను సృష్టిస్తున్నారు. ఆ విధంగా ఇటీవల మరొక థియేటర్ కూడా నిర్మాణ దశలో ఉంది. ఏ ఏ ఏ  పేరుతో అల్లు అర్జున్ కూడా ఏషియన్ సినిమాస్ పేరు తో అల్లు అర్జున్ కూడా మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు.  అమీర్ పేట్ సత్యం థియేటర్ ప్లేస్ లో ఈ భారీ మల్టీ ప్లేక్స్ నిర్మాణం జరుగుతూ ఉంది.  

తాజాగా ఇప్పుడు మరొక భారీ మల్టీ ప్లక్స్ నిర్మాణం జరుగుతూ ఉండడం సెన్సేషన్ గా మారింది.  ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు స్టార్ హీరో లు భాగస్వామ్యులు కావడం విశేషం. ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ టాలీవుడ్ హీరో మహేష్ బాబు వెంకటేష్ మరియు రానా లతో కలిసి ఏ ఎంబీ విక్టరీ పేరుతో భారీ స్థాయిలో ఓ మల్టీప్లెక్స్ స్టార్ట్ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.  హైదరాబాదులో కమర్షియల్ స్పేస్ లో ఈ భారీ నిర్మాణం ఉండబోతుందని, సకల సదుపాయాలతో ఓ రేంజ్ లో ఇది రూపొందించబోతున్నారు అని టాక్ వినిపిస్తుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ స్థలంలో ఈ భారీ నిర్మాణం రూపుదిద్దుకొనుంది అని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

AVD

సంబంధిత వార్తలు: