నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఓపిక కి మెచ్చుకోవాలబ్బా .... ??

GVK Writings
రెబల్ స్టార్ ప్రభాస్ తో తొలిసారిగా యువి క్రియేషన్స్ సంస్థ తీసిన సినిమా మిర్చి. వంశి, ప్రమోద్ కలిసి నిర్మించిన ఆ సినిమా ద్వారా కొరటాల శివ టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. అప్పట్లో మంచి అంచనాల తో రిలీజ్ అయిన మిర్చి మూవీ సూపర్ హిట్ కొట్టిన విషయం తెల్సిందే. ఆ తరువాత ఇటీవల మరొక్కసారి ప్రభాస్ తో యువి వారు నిర్మించిన మూవీ సాహో. శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని భారీ పాన్ ఇండియా మూవీ గా నిర్మించారు. సుజీత్ తీసిన ఈ సినిమా యావరేజ్ విజయాన్ని అందుకుంది.
ఇక ప్రస్తుతం మళ్ళి అదే బ్యానర్ పై ప్రభాస్ చేస్తున్న సినిమా రాధేశ్యామ్. అయితే ఈ మూవీలో ప్రభాస్ సొంత సంస్థ గోపికృష్ణ మూవీస్ కూడా కొంత మేర భాగస్వామిగా వ్యవహరిస్తోంది. భారీ యాక్షన్ తో కూడిన హృద్యమైన ప్రేమకథ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా కృష్ణంరాజు, భాగ్యశ్రీ, ప్రియదర్శి, జయరాం, సాచింది ఖేడేకర్ తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు. ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్యగా అలానే పూజ హెగ్డే ప్రేరణ గా కనిపించనున్నారు. ఇక అన్ని వర్గాల ఆడియన్స్ తో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ ని కూడా ఆకట్టుకునేలా దర్శకుడు రాధాకృష్ణ ఈ మూవీ ని ఎంతో అద్భుతంగా తీస్తున్నట్లు టాక్.
కాగా ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదల కానుంది. అయితే విషయం ఏమిటంటే, ఎప్పుడో ప్రారంభం అయిన ఈ సినిమా నుండి ఇప్పటివరకు కేవలం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ మాత్రమే రిలీజ్ అయింది. ఎప్పుడో టీజర్, సాంగ్స్ వంటివి విడుదలవుతాయి అని భావించిన రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి ఇప్పటివరకు పూర్తి నిరాశే ఎదురవుతోంది. అయినప్పటికీ కూడా ప్రభాస్ ఫ్యాన్స్ ఓపిక కి మెచ్చుకోవచ్చని, వారు సినిమా నుండి ఇంకా ఏమి రిలీజ్ కానప్పటికీ కూడా సహనంతో అప్ డేట్స్ కోసం వేచి చూస్తున్నారని, త్వరలో సినిమాకి సంబంధించి టీజర్ మరియు ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసేలా యువి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని ఇన్నర్ వర్గాల సమాచారం. మరి ఇదే కనుక నిజం అయితే త్వరలో ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకోవడానికి సిద్ధం అవ్వచ్చని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: