"ఓటిటి" లోకి ఎంట్రీ ఇచ్చిన 100 కోట్ల సినిమా..!

MADDIBOINA AJAY KUMAR
2022 వ సంవత్సరం మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యి సూపర్ సక్సెస్ అందుకున్న సినిమాలలో డిజె టిల్లు మూవీ ఒకటి. ఈ మూవీ లో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించగా , నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఒక్క సారిగా సిద్దు క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడంతో ఆ తర్వాత ఈ మూవీ కి కొనసాగింపుగా టిల్లు స్క్వేర్ అనే మూవీ ని రూపొందించబోతున్నట్లు ఈ మూవీ బృందం అనౌన్స్ చేసింది.

ఇకపోతే టిల్లు స్క్వేర్ మూవీ మార్చి 29 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా  , మల్లిక్ రామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించిన ఈ మూవీ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకొని 100 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్లగొట్టి ఈ సంవత్సరం బ్లాక్ బాస్టర్ మూవీ ల లిస్టులో చేరిపోయింది.

ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకున్న ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ రోజు నుండి ఈ సినిమాను ఈ సంస్థ వారు స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇకపోతే ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ బ్లాక్ బస్టర్ మూవీ నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sj

సంబంధిత వార్తలు: