ముద్దుగుమ్మ ఐశ్వర్య రాజేష్ తెలుగు అమ్మాయి అయిన ఈ నటి తమిళ సినిమాల ద్వారా వెండితెరకు పరిచయం అయింది . అక్కడ మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ హీరోయిన్ భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన 'కౌసల్య కృష్ణమూర్తి' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది . ఈ సినిమా థియేటర్ల వద్ద పెద్దగా ప్రభావం చూపకపోయిన క్రికెటర్ గా ఈ ముద్దుగుమ్మ చేసిన నటనకు సిని జనం నుండి మంచి మార్కులు పడ్డాయి . ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో కూడా ఒక హీరోయిన్ గా కూడా నటించి తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది .
ఈ ముద్దుగుమ్మ తాజాగా హీరోయిన్ గా నటిస్తున్న సినిమా 'తిట్టం ఇరండు' (ప్లాన్ బి) . ఇది ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా . ఇందులో సుభాష్ హీరోగా నటించాడు . ఈ చిత్రం మరికొన్ని రోజుల్లో సోనీ లివ్ 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ కానుంది .
దీనిలో భాగంగా చిత్ర బృందం శుక్రవారం మీడియాతో పలు విషయాలను తెలిపారు . అందులో భాగంగా ఐశ్వర్య రాజేష్ నాకు చిన్నతనంలో సినిమాలు చూస్తున్న సమయంలో హీరోయిన్ రంభ లాంటి పాత్రలు చేయాలని ఆశగా ఉండేది అని , ఆ నటి లాగే గ్లామర్ పాత్రలు కూడా చేయాలని , ఇప్పుడు కూడా గ్లామర్ పాత్రలు చేయడానికి సిద్ధమే అని , కానీ దానికి తగిన కారణం , సన్నివేశం ఉండాలని అని ఈనాటి పేర్కొంది . మరియు ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలో నేను ఒక పోలీస్ అధికారి అని , ఈ సినిమా ఒక క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో నడుస్తుంది అని తెలిపింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సినిమాల ఎంపిక విషయంలో ఏ మాత్రం తొందర పడకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఉండే కథలను మాత్రమే ఎంచుకొని చేస్తుంది అని తెలుస్తోంది .