ఏపీ, తెలంగాణలో సూపర్ థియేటర్లు ... ఇక 50 సీట్లే...!
ఇక ఇప్పుడు సెకండ్ వేవ్ విజృంభణ తో మళ్లీ థియేటర్లను మూసేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ త్వరలోనే థియేటర్లు తిరిగి ఓపెన్ అయినా మునుపటి లా ప్రేక్షకులు అయితే ఖచ్చితంగా రారనే అంటున్నారు. ఈ క్రమంలోనే ఇకపై థియటర్ల స్వరూపం మారిపోతోందని అంటున్నారు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు. ఆయన సోదరుడు వెంకటేష్ హీరోగా నటించిన రీమేక్ మూవీ నారప్ప ఓటీటీలో రిలీజ్ అవుతోంది. దీనిపై ఆయన మాట్లాడుతూ ఇకపై రెగ్యులర్ థియేటర్లలోకి వెళ్లి సినిమా చూసే ఛాన్సులు తగ్గిపోతాయని ఆయన అంటున్నారు.
ఇకపై సూపర్ స్క్రీన్స్ థియేటర్లు అందుబాటులోకి వస్తాయని ఆయ చెపుతున్నారు. ఈ సూపర్ స్క్రీన్ థియేటర్లు కేవలం 50 సీటింగ్ కెపాసిటీతో ఉంటాయని ఆయన చెపుతున్నారు. ఇప్పటికే బస్టాండ్ లలో థియేటర్లు వచ్చేశాయి. ఇప్పుడు పెద్ద పెద్ద క్లబ్ హౌస్ లలోనూ .. గ్రూప్ హౌస్ లలో కూడా ఈ 50 సిట్టింగ్ కెపాసిటీ ఉన్న థియేటర్లు వచ్చేస్తాయని ఆయన చెపుతున్నారు. ఇక త్వరలోనే బ్యాంకుల్లో కూడా థియేటర్లు ఓపెన్ చేసే కార్యక్రమం అమలు లోకి వస్తుందని కూడా సురేష్ బాబు చెప్పారు.